MoviesRajini ర‌జ‌నీని సెట్లోనే కాల్చి చంపేస్తాన‌ని బెదిరించిన నిర్మాత‌... గుక్క ప‌ట్టి...

Rajini ర‌జ‌నీని సెట్లోనే కాల్చి చంపేస్తాన‌ని బెదిరించిన నిర్మాత‌… గుక్క ప‌ట్టి ఏడ్చి ఏం చేసిందంటే…!

సినిమారంగంలో ఒక్కోసారి అనూహ్య సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. హీరోయిన్ రజ‌ని ఒక వెలుగు వెలిగింది. రాజేంద్రప్రసాద్, బాలయ్య లాంటి హీరోలతో ఆమె నటించి సూపర్ హిట్లు కొట్టింది. రజ‌ని తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి సినిమాలు చేసింది. షూటింగ్ స్పాట్లోనే ఒక నిర్మాత పిస్టల్ తీసి ఆమెను కాల్చి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ర‌జ‌నీని అలా బెదిరించిన ఆ నిర్మాత ఎవరో కాదు.. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు.

అసలు విషయంలోకి వెళితే త్రివిక్రమ రావు తనయుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా మేనకోడలు అనే సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అయితే జ‌మున న‌టించిన మేన‌కోడ‌లు టైటిల్‌తోనే మ‌రోసారి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు పేమెంట్ ఇచ్చే విషయంలో రజ‌నీని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. రేపు ఇస్తాం.. నాలుగు రోజుల తర్వాత ఇస్తాం అంటూ పేమెంట్ ఇవ్వకుండా ఆమెకు మాయమాటలు చెబుతూ షూటింగ్ చేయించుకుంటున్నారు.

ఓ రోజు రజ‌ని డబ్బులు ఇస్తేనే షూటింగ్ కు వస్తానని కరాకండిగా చెప్పేసి కారు ఎక్కి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో త్రివిక్రమ రావు అక్కడికి వచ్చారు. అక్కడ ఏదో గలాటా జరుగుతుందన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే త్రివిక్రమ రావు షూటింగ్ ఆగిపోతుంది.. నిర్మాత ఇబ్బంది పడతారు.. రజనీకి ఆ రెమ్యూనరేషన్ తాను ఇస్తానని చెప్పండి అని అక్క‌డున్న వారితో చెప్పారు. అయితే రజ‌ని చిన్నాయన చెప్పటం ఏంటి ? ఆయన నాతో ఏమైనా సినిమా చేయించుకుంటున్నారా నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సింది నిర్మాతలు.. నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇస్తే తాను షూటింగ్ చేస్తాను.. అప్పటివరకు షూటింగ్ చేయనని తేల్చి చెప్పింది.

అక్క‌డితో ఆగ‌కుండా ఆమె వెంట‌నే కారు ఎక్కేసి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన చూసిన త్రివిక్రమరావు ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే తన కారు స్టార్ట్ చేసి రజనీ కారుని క్రాస్ చేసి తన బొడ్డులోని పిస్టల్ తీసి రజనీని వెంటనే షూటింగ్ లోకి రా… లేకపోతే నిన్ను కాల్చేసి నేను కూడా కాల్చుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రజ‌నీ భయపడి పోయింది గుక్క పట్టి ఏడ్చేసింది. సార్ మీరు రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పినా నేను నమ్మలేదు.. నిర్మాతలు అలా డ్రామా ఆడించి ఉంటారని భావించాన‌ని.. పొరపాటు అయిపోయిందని.. అసలు ఈ సినిమాకు తనకు రెమ్యున‌రేష‌న్‌ వద్దని వెంటనే షూటింగ్ కి వచ్చేస్తాన‌ని చెప్పింద‌ట‌.

అయితే ఆ తర్వాత త్రివిక్రమ రావు రజనీకి రావాల్సిన రెమ్యూనరేషన్ను నిర్మాతలతో మాట్లాడి ఇప్పించేశారు. త్రివిక్రమ రావు భావన ఏంటంటే అప్పటికే షూటింగుకు అందరూ వచ్చారు. హీరోయిన్ లేకపోతే అందరి కాల్ సీట్లు వేస్ట్ అవుతాయి. నిర్మాతకు భారీ నష్టం వస్తుందన్నదే ఆయన అభిప్రాయం. అయితే రజిని పొరపాటుగా ఆయనను తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంతో.. ఆయనకు కోపం తన్నుకు వచ్చింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news