Moviesఅవమానించిన వాళ్లే బాలయ్యను నెత్తిన పెట్టుకుంటున్నారుగా.. ఇది న‌ట‌సింహం అంటే...!

అవమానించిన వాళ్లే బాలయ్యను నెత్తిన పెట్టుకుంటున్నారుగా.. ఇది న‌ట‌సింహం అంటే…!

స్టార్ హీరో బాలయ్య భోళా మనిషి అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించే బాలయ్య రియల్ లైఫ్ లో నటించడానికి మాత్రం ఇష్టపడరు. తనకు ఫ్లాప్ ఇచ్చినా ఆ డైరెక్టర్ల గురించి బాలయ్య ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లు చేయలేదు. బాలయ్యతో పని చేసిన హీరోయిన్లు సైతం ఆయన గురించి గొప్పగా చెబుతారు. సినిమా ఇండస్ట్రీలో బాలయ్య గురించి వినే విషయాలకు ఆయన రియల్ లైఫ్ కు పొంతన ఉండదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.

అయితే అఖండ సినిమాకు ముందు చాలామంది స్టార్ హీరోయిన్లు బాలయ్యను పరోక్షంగా అవమానించారు. బాలయ్యకు జోడీగా నటించాలని అడిగితే డేట్స్ లేవని, ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇస్తే మాత్రమే నటిస్తామని కొంతమంది హీరోయిన్లు బాలయ్య సినిమాల విషయంలో దారుణంగా వ్యవహరించారు. ఈ రీజన్ వల్లే బాలయ్య తనకు జోడీగా పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్లతో నటించడానికి ఓకే చెప్పాల్సి వచ్చింది.

అయితే అఖండ సినిమా సక్సెస్ తో బాలయ్య రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. యంగ్ జనరేషన్ స్టార్స్ సైతం బాలయ్య సినిమాలకు హిట్ టాక్ వస్తే వేరే లెవెల్ లో కలెక్షన్లు వస్తాయని ఫిక్స్ అయ్యారు. అఖండ సినిమా టికెట్ రేట్లు పెరిగిన తర్వాత విడుదలై ఉంటే సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చేవి. నెగిటివ్ టాక్ తో కూడా వీరసింహారెడ్డి రు. 75 కోట్ల రూపాయల నెట్‌ కలెక్షన్లను సాధించింది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు బాలయ్య సినిమాలో ఆఫర్ కోసం తహతహలాడుతున్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన కాజల్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలీల సైతం బాలయ్య మూవీలో కూతురి ఛాన్స్ అంటే వెంటనే ఓకే చెప్పింది. తమన్నా, పూజా హెగ్డే సైతం బాలయ్యకు జోడీగా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అవమానించిన వాళ్లే బాలయ్యకు జోడీగా నటించడానికి ఇష్టపడుతున్నారని ఇదీ బాలయ్య రేంజ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news