Moviesచ‌ర‌ణ్ క్రేజ్ కోసం ఆ హీరోయిన్ చేయాల్సిందంతా చేసింది... ప‌క్కా ప్లాన్‌తోనే...!

చ‌ర‌ణ్ క్రేజ్ కోసం ఆ హీరోయిన్ చేయాల్సిందంతా చేసింది… ప‌క్కా ప్లాన్‌తోనే…!

ఆస్కార్ అవార్డు కోసం ప్రతి తెలుగువాడు కొన్ని సంవత్సరాలుగా కన్న కల ఎట్టకేల‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో దర్శకుడు రాజమౌళి అండ్ టీం ఎక్కడా తగ్గలేదు. అయితే ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలలో ఆస్కార్ ప్రమోషన్లు హడావుడి విషయంలో రామ్ చరణ్ కాస్త ముందున్నాడు.

ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ముందుగానే అమెరికా వెళ్ళాడు. చరణ్ వెళ్ళినప్పుడు రాజమౌళి టీం కంటే చరణ్ సొంత పీఆర్ టీం బాగా హార్డ్ వర్క్ చేసింది. చిరంజీవి కూడా స్వయంగా రంగంలోకి దిగి పీఆర్ టీం మొత్తాన్ని తెరవెనక నుండి నడిపించాడని కూడా టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. చరణ్ కు అమెరికాలో ప్రియాంక చోప్రా కూడా జత కలిసింది. గతంలో వీరిద్దరూ కలిసి తుఫాన్ సినిమాలో కూడా నటించారు.

ఆమె సహకారంతో చరణ్ కు మరింత గట్టిగా ప్రచారం చేసి పెట్టారు. ప్రియాంక చరణ్ ఎక్కువ మంది హాలీవుడ్ ప్రముఖులని కలిసేలా ప్లాన్ చేసిందట. అలాగే కొన్ని సూపర్ హిట్ హాలీవుడ్ కార్యక్రమాలకు కూడా చరణ్ సిఫార్సు చేయడంతో పాటు.. హాలీవుడ్ ఇంటర్వ్యూలు కూడా ప్రియాంక చోప్రా సహాయ సహకారాల వల్లే జరిగిందని తెలుస్తోంది. ఇంకా చరణ్ హైదరాబాదులో ల్యాండ్ అవ్వలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ ఇండియా టుడే ప్రోగ్రామ్‌లో గెస్ట్ గా పాల్గొనబోతున్నాడు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నాడు. చరణ్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. అక్కడ బాలీవుడ్ మీడియా మొత్తాన్ని ఎయిర్‌పోర్టులో మోహరించారు. ఇక చర‌ణ్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా ల్యాండింగ్ కోసం కనీవినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా చరణ్ హాలీవుడ్ మీడియాలో పాపులర్ కావటం.. ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ వద్ద హైలెట్ అవ్వటం అంతా ప్రియాంక పుణ్యమే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news