Movies"నాకు ఆ మూడు ఉంటే చాలు" ..సాయి పల్లవి సంచలన కామెంట్స్..!!

“నాకు ఆ మూడు ఉంటే చాలు” ..సాయి పల్లవి సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . ఎంబిబిఎస్ చేసి డాక్టర్ వృత్తిని చేపట్టిన సాయి పల్లవి ఎవరు ఊహించిన విధంగా మలర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .. తనదైన స్టైల్ నటించిన మెప్పించింది . ఇక ఆ తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిదా సినిమాతో తరంగేట్రం చేసి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది.

కాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ..రీసెంట్గా నటించిన లాస్ట్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. విరాట పర్వం, గార్గి..రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోని సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతుంది అంటూ కూడా పలు వార్తలు అయ్యాయి.

అయితే వాటికి చెక్ పెడుతూ అవి అంత ఫేక్ అంటూ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేసింది. కాగా రీసెంట్ గా తాజాగా సాయి పల్లవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నవ్వులు, ఆశలు, కృతఙ్ఞతలు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. హ్యాపీ లైఫ్ కి అవి మూడు ఉంటే చాలని ఆమె పరోక్షంగా చెప్పారు. ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి ప్రత్యేకం అని నిరూపించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news