Moviesచికెన్ అడిగితే ఈ ప్ర‌ముఖ న‌టిని ఘోరంగా అవ‌మానించిది ఎవ‌రు...!

చికెన్ అడిగితే ఈ ప్ర‌ముఖ న‌టిని ఘోరంగా అవ‌మానించిది ఎవ‌రు…!

తెలుగు ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన నటీమణులలో డబ్బింగ్ జానకి ఒకరు. ఈ ప్రముఖ నటి ఒక ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అవమానాల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. నేను బ్యాలెన్స్డ్ గా ఉండటానికి ఇష్టపడతానని తెలిపారు. నా కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో నాకు ఆస్తులేం లేవని డబ్బింగ్ జానకి కామెంట్లు చేశారు.

నాకు అప్పులంటే భయమని ఆమె పేర్కొన్నారు. నాకు ఒక్క పైసా అప్పు లేదని అది దేవుడి దయ అని డబ్బింగ్ జానకి వెల్లడించారు. ఇతరులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నేను వెజిటేరియన్ అని ఆమె కామెంట్లు చేశారు. నేను ఒక కన్నడ మూవీ షూటింగ్ కోసం వెళ్లానని ఆ సినిమాలో అనంత్ నాగ్ మరి కొందరు నటించారని ఆ సినిమా చాలా పెద్ద సినిమా అని డబ్బింగ్ జానకి తెలిపారు.

మైసూర్ లో ఆ సినిమా షూటింగ్ జరిగిందని ఆ మూవీలో మదర్ క్యారెక్టర్ లో నటించానని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు. 15 రోజులు షెడ్యూల్ అని ఆ సమయంలో నేను నా వెజ్ ఎక్కువగా తినేదానినని ఆమె కామెంట్లు చేశారు. కన్నడ మేనేజర్ అందరికీ చికెన్ పెట్టి నాకు చికెన్ పెట్టలేదని అలా ఎందుకు చేశావని అడగగా డైరెక్టర్, హీరోయిన్, హీరోకు మినహా ఎవరికీ చికెన్ పెట్టొద్దని ప్రొడ్యూసర్ చెప్పాడని మేనేజర్ తనతో చెప్పారని డబ్బింగ్ జానకి వెల్లడించారు. చికెన్ విషయంలో అలాంటి అవమానాలు జరిగాయని ఆమె తెలిపారు.

భోజనానికి అలస్యంగా వెళితే భోజనం ఉండేది కాదని ఆమె చెప్పుకొచ్చారు. చికెన్ అలవాటు ఉండటం వల్లే ఇంత బాధ పడ్డానని అనిపించిందని… అప్పుడు చికెన్ అలవాటును వదులుకున్నానని డబ్బింగ్ జానకి వెల్లడించారు. ఆ తర్వాత 9 నెలల పాటు చికెన్ తినలేదని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత నా కొడుకుకు జాబ్ వస్తే నాన్ వెజ్ లైఫ్ లో తిననని అనుకున్నానని కొడుకుకు జాబ్ రావడంతో ఆ అలవాటుకు పూర్తిగా దూరమయ్యానని వెల్లడించారు. ఎగ్, కేక్ కు కూడా దూరంగా ఉన్నానని డబ్బింగ్ జానకి పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news