Moviesజాక్ పాట్ కొట్టిన శర్వా..ఒక్కేదెబ్బకి రెండు పిట్టలు..ఏం లక్ రా బాబు..!!

జాక్ పాట్ కొట్టిన శర్వా..ఒక్కేదెబ్బకి రెండు పిట్టలు..ఏం లక్ రా బాబు..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ..ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు . ఇన్నాళ్లు మ్యారేజ్ లైఫ్ అంటేనే భయపడిన శర్వానంద్ రీసెంట్ గా మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు . రీసెంట్గా రక్షిత రెడ్డితో శర్వానంద్ జరిగిన ఎంగేజ్మెంట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

శర్వానంద్ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ నుంచి స్టార్ ప్రముఖులు అందరు హాజరయ్యారు . మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . ఈ క్రమంలోనే రక్షిత రెడ్డి బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ కాబోయే భార్య ఎవరో కాదు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి కుమార్తె .

ఈమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాగా ప్రజెంట్ ఇండియాకు వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుంది . వీళ్ళిద్దరికీ మూడు సంవత్సరాల ముందు నుంచే పరిచయం ఉందట. కామన్ ఫ్రెండ్ ద్వారా మొదలైన వీళ్ళ ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధం ముడిపడే విధంగా మలుచుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు .అంతేకాదు రక్షిత శెట్టి నుండి కోట్ల ఆస్తిని కట్నంగా శర్వా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు న్యాయవాది మధుసూదన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీలో కూడా బ్యాక్ గ్రౌండ్ ఉందని .. ఇదే క్రమంలో బిగ్ డైరెక్టర్స్ తో ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా శర్వానంద్ కు రాబోయే రోజుల్లో మంచి మంచి స్టోరీస్ పడే అవకాశాలు ఉన్నాయని జనాలు చెప్పుకుంటున్నారు . ఈ విధంగా కోట్లకు కోట్ల ఆస్తి కట్నంగా నొక్కేసిన శర్వానంద్.. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పొజిషన్లోకి వెళ్తాడంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ఇలా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే సామెతను బాగా ఫాలో అయ్యాడు శర్వానంద్ అంటూ కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news