Movies"దానికి ఇదే సరైన సమయం"..ఫ్యాన్స్ కి ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన...

“దానికి ఇదే సరైన సమయం”..ఫ్యాన్స్ కి ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత పొజిషన్ ప్రజెంట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఊపు ఊపేసిన హీరోయిన్ సమంత.. ప్రజెంట్ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ దక్షిణ కొరియాలో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటుంది . అందుతున్న సమాచారం ప్రకారం మయోసైటిస్ జబ్బు సమంతకు దాదాపు కంట్రోల్ లోకి వచ్చిందని అంటున్నారు డాక్టర్లు.

అంతేకాదు ఇప్పుడు సమంత షూటింగ్లో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉందట. ఈ క్రమంలోనే త్వరలోనే తన నెక్స్ట్ సినిమా ఖుషీ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. షోషల్ మీడియాకి కొంతకాలం నుంచి దూరంగా ఉన్న సమంత ..రీసెంట్ గా చేసిన పోస్ట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది . న్యూ ఇయర్ సందర్భంగా ముందుగానే అభిమానులకు విష్ చేస్తూ సమంత అద్దిరిపోయే సందేశాని అందచేసింది.


“ముందుకు సాగండి ..మనం ఏం నియంత్రంచగలమో.. వాటిని మాత్రమే నియంట్రిస్తాం. కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో బ్రతికేయడానికి రిసల్యూషన్ తీసుకునే సమయం ఇదే ..గాడ్ బ్లెస్ హ్యాపీ 2023” అని సమంత క్యాప్షన్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు మూడిగా బాధగా ఉన్న సమంత రీసెంట్గా నవ్వుతూ సెల్ఫీతో ఫోటో పోస్ట్ చేసేసరికి సమంతా అభిమానులు ఎగరిగంతేస్తున్నారు. సమంత ఆరోగ్యం కుదుటపడిందని ఇక మళ్ళీ యధావిధిగా తన సినిమాలు చేస్తుందని భావిస్తున్నారు . అంతేకాదు త్వరలోనే సమంత తన బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది అంటూ సమాచారం అందుతుంది. చూడాలి సమంతకి 2023 ఏ విధంగా కలిసొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news