Movies"ఒళ్లు బలిసిందా ఏంటీ"..? ఇండియన్స్ పై ప్రియాంక కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

“ఒళ్లు బలిసిందా ఏంటీ”..? ఇండియన్స్ పై ప్రియాంక కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు మిస్ వరల్డ్ టైటిల్ తో బాలీవుడ్ ను షేక్ చేసింది . అయితే మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్నా కానీ బాలీవుడ్లో అమ్మడుకు సరైన అవకాశాలు రాలేదు. పాశ్చాత్య దేశాలలో ని ప్రేక్షకులు అమ్మడు అందాలకి ఫిదా అయ్యారే కానీ ..బాలీవుడ్ జనాలు అంతగా పట్టించుకోలేదు . అంతేకాదు కొందరు జనాలు ఆమెను కావాలని ఇండస్ట్రీలోకి రాకుండా వెనక్కి నెట్టేసారు. ఈ విషయాన్ని స్వయానా ఆమె చెప్పకు వచ్చింది.

వృత్తిపరంగా అనేక సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండియాలో చాలావరకు ప్రజలు కుళ్ళు తో నిండిపోయి ఉన్నారని సంచలన కామెంట్స్ చేసింది. చాలా తక్కువ మంది మాత్రమే వేరొకరి విజయాలను తమ విజయం గా సంతోషంగా స్వీకరిస్తారని చాలావరకు పక్క వాళ్ళ గెలుపును స్వీకరించలేరని ..కొందరు తన టాలెంట్ కెరీర్ ని కిల్ చేయడానికి చాలా ట్రై చేశారని ..నాకు పని దొరకకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చింది .

 

అంతే కాదు తనకి ప్రతిరోజు చెడు జరగాలని వాళ్ళు కోరుకున్నట్లు స్వయంగా ప్రియాంక చెప్పుకోరావడం సంచలనంగా మారింది . ఏది ఏమైనా సరే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదగలిగానని ..తనని ఏది ఆపలేదని స్పష్టం చేసింది . కాగా ప్రియాంక చోప్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు ఇండియన్స్ ఆమె మాటలు తప్పుపడుతున్నారు.. ఫారిన్ కంట్రీ అబ్బాయిని పెళ్లి చేసుకొని నీకు ఒళ్ళు బలిసిందా..? అందుకే ఇండియన్స్ ని ఇలా అంటున్నావా..? ఎవరైనా సరే ఏ కంట్రీలో ఆయన కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు.. కానీ నువ్వు ఇలా నీకు లైఫ్ ఇచ్చిన దేశాన్ని తప్పు పట్టడం తప్పు అంటూ ఆమెపై మండిపడుతున్నారు . అంతేకాదు ప్రియాంక చోప్రాను ఇండియాలో బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news