Moviesవాళ్లని చూస్తే కడుపు మండిపోతోంది..ఇండస్ట్రీలో తన పొజీషన్ పై చిరంజీవి షాకింగ్...

వాళ్లని చూస్తే కడుపు మండిపోతోంది..ఇండస్ట్రీలో తన పొజీషన్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారి కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేస్తున్న చిరంజీవి ..ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతున్నాడు.

కాగా రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే భోళా , శంకర్ వాల్తేరు వీరయ్య సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా రీసెంట్ గా “శూన్యం నుంచి శిఖరాగ్రాలకు” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సంచలన కామెంట్స్చేసారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..” నన్ను అందరూ మెగాస్టార్ మెగాస్టార్ అంటున్నారు.. కానీ నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్ ని చూస్తే చాలా కుళ్ళు గా ఉంది. కడుపు మండిపోతుంది. నా సినిమాలకు నేనే ప్రమోట్ చేసుకునే స్థాయికి డౌన్ అయ్యాను. ఇంట్లో కూడా నా సినిమాలు ఎవరు చూడట్లేదు . నేను నటించిన గాట్ ఫాదర్ సినిమాను నా మనవరాలు , మనవాళ్ళు చేత చూయించుకునే స్థాయికి దిగజారిపోయాను. నా గొప్పలు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది.

అందరికీ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”, అల్లు అర్జున్ “పుష్ప” లాంటి సినిమాలతో ఫేమస్ అయిపోవడంతో నా పేరు ఎవరికీ గుర్తు ఉండట్లేదు. ఈ తరం పిల్లలు నా గురించి అస్సలు చెప్పుకోవడం లేదు . ఈ క్రమంలోనే నాకు వాళ్ళని చూస్తే కడుపు మండిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు . చిరంజీవి ఆ వ్యాఖ్యలు సరదాగా చేసిన ఆయన మనసులోని బాధను అర్థం చేసుకుంటున్నాం అంటున్నారు మెగా ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజం రాబోయే తరానికి సినీ ఇండస్ట్రీకి కాబోయే మెగాస్టార్ మాత్రం రామ్ చరణ్ ని అంటూ జనాలు గట్టిగా చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news