Moviesబిందు మాధవి ఆ కారణం వల్లే స్టార్ హీరోయిన్ కాకుండా తొక్కేశారా...!

బిందు మాధవి ఆ కారణం వల్లే స్టార్ హీరోయిన్ కాకుండా తొక్కేశారా…!

తెలుగమ్మాయి బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లెలో పుట్టింది. చెన్నైలో సెటిలయ్యారు. తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్‌గా నటించింది. తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖ బిజినెస్ కంపెనీ అయిన శరవణ స్టోర్స్ కోసం పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. అలా బిందు మాధవి కెరీర్ ముందు మోడల్ గా ప్రారంభమైంది. అదే తనకు సినిమాల్లో అవకాశాలని తెచ్చిపెట్టింది. వాస్తవంగా బిందు మాధవి తండ్రికి సినిమా ఇండస్ట్రీపై అంత సదభిప్రాయం ఉండేది కాదు.

అందుకే, ఆమె హీరోయిన్‌గా నటిస్తానంటే ససేమిరా అన్నారు. ఈ విషయంలో తండ్రితో చిన్న విబేధాలు తలెత్తి దాదాపుఇ 8 నెలలు మాట్లాడుకోలేదు. ఇదే విషయంలో తన తల్లి కూడా అంగీకరించలేదు. అయినా సరే చెన్నైలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రాంతో ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఆల్బం సినిమా ఆఫీసులకి పంపింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే టీవీలో కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది. ఆ రకంగా తనిష్క్ ప్రకటనలో దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మాణంలో వచ్చిన ఆవకాయ్ బిర్యానీ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది.

అలాగే, తమిళ దర్శకుడు చేరన్ రూపొందించిన పొక్కిషమ్ అనే సినిమాలో కీలక పాత్రను చేసే ఛాన్స్ దక్కింది. అలా ఈ రెండు సినిమాలతో కాస్త బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దాంతో దర్శకుడు పూరి జగన్నాధ్ నిర్మాతగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ సినిమాలోనూ నటించింది. ఇందులో పొగరబోతు పాత్రలో నటించింది.

అయితే, ఇదే తన ఒరిజినల్ క్యారెక్టర్ అని కొందరు భావించారు. బయట బిందు మాధవికి పొగరు అనే టాక్ కాస్త స్ప్రెడ్ అయింది. ఇదే తనకి టాలీవుడ్‌లో మైనస్ అయింది. ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వప్పం సినిమాలో చేసిన వేశ్య పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఒక్క పాత్ర తమిళంలో మంచి గుర్తింపు తెచ్చి అక్కడ వరుసగా అవకాశాలు తెచ్చిపెట్టింది.

దాంతో కాస్త టాలీవుడ్ సినిమాలను లైట్ తీసుకుందనే ప్రచారం జరిగింది. తమిళ సినిమాలు సక్సెస్ అవుతుండటంతో తెలుగు మేకర్స్‌ను లెక్క చేయలేదని కామెంట్స్ వినిపించాయి. ఓవర్ యాటిట్యూడ్ వల్లే తెలుగులో ఫేడౌవుట్ అయిందని చెప్పుకున్నారు. లేదంటే ఈ తెలుగమ్మాయి కొంతకాలం మన టాలీవుడ్‌లో బాగానే నెట్టుకొచ్చేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news