Moviesమా బావకు ఆ పిచ్చి.. అందుకే అలా చేశా..సంచలన విషయాలను బయటపెట్టిన...

మా బావకు ఆ పిచ్చి.. అందుకే అలా చేశా..సంచలన విషయాలను బయటపెట్టిన శ్రీహరి భార్య..!!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో సినిమాలను చూస్ చేసుకుంటూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా విలన్ గా భిన్నమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ.. తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు శ్రీహరి. ఇప్పటికీ టీవీలో ఆయన నటించిన సినిమా ఏదైనా వస్తే కచ్చితంగా శ్రీహరిని మనం గుర్తు చేసుకుంటాం. మంచి నటుడిని సినీ ఇండస్ట్రీ కోల్పోయిందని బాధపడతాం. అలాంటి అభిమానులను సంపాదించుకున్నాడు శ్రీహరి.

ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న భార్య డిస్కో శాంతి కన్నీరుగా విలనిపించారు. శ్రీహరి మరణ వార్త విని తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. భారీ సంఖ్యలో అభిమానులు సినీ ప్రముఖులు చేరి ఆయన అంత్యక్రియలను జరిపించారు. కాగా రీసెంట్గా డిస్కో శాంతి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను మోసం చేసిన వాళ్ల గురించి చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.

శ్రీహరి మంచితనాన్ని సినీ ఇండస్ట్రీలో వాడుకుని ఆయనను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. తర్వాత తనని పలకరించడానికి కూడా ఎవరు రాలేదని వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని.. ఇక ఆ టైంలో తాను డబ్బులేక అప్పులు తీర్చడానికి తన నగలు కార్లు మొత్తం అమ్మేశానని.. ఆ టైంలో ఆమెకు ఏం చేయాలో దిక్కుతోచలేదని చెప్పుకొని బాధపడింది . అంతేకాదు తాను చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్ సరిగ్గా ఇచ్చుంటే.. తనకు ఈ కర్మ పట్టేది కాదని కూడా చెప్పుకొచ్చింది. కొందరు ఆమెను నటించడానికి వాడుకొని ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారని ఇదే విషయం బావకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ..బావకు సినిమాలు అంటే పిచ్చి అని.. ఆ కారణంగానే డబ్బులు ఇవ్వకపోయినా.. ప్రాబ్లం లేదు నటించాలి అని చెప్పే వారిని అని చెప్పకువచ్చింది. దీంతో శ్రీహరి భార్య డిస్కో శాంతి మాటలు వైరల్ గా మారాయి. శ్రీహరిని అంతలా మోసం చేసిన వ్యక్తులు ఎవరబ్బా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news