Moviesమ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిర మృతి... ఆమె ఫ్యామిలీ గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు...

మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిర మృతి… ఆమె ఫ్యామిలీ గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఈ రోజు ఉద‌యం మృతి చెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో ఆమె బాధ‌ప‌డుతూ చికిత్స కూడా పొందుతున్నారు. ఇందిరా దేవి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు స్వ‌యానా మ‌ర‌ద‌లు కావ‌డం విశేషం. ఆమె తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలోని ముస‌ళ్ల‌మ‌డుగు గ్రామ ఆడ‌ప‌డుచు. మ‌హేష్ కూడా చిన్న‌ప్పుడే ముస‌ళ్ల‌మ‌డుగులోని అమ్మ‌మ్మ ఇంటి వ‌ద్ద కూడా కొద్ది రోజుల పాటు పెరిగాడు.

కృష్ణ‌తో పెళ్ల‌య్యాక ఆమె కొద్ది రోజులు గుంటూరు జిల్లా తెనాలి మండ‌లం బుర్రిపాలెంలో ఉన్నారు. ఆ త‌ర్వాత మద్రాస్‌కు మ‌రి ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. ఇక ఇందిరాదేవి ఈ రోజు ఉద‌యం ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు కుమారులు కాగా… ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.

ఇటీవల అనారోగ్యంతో మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు మృతి చెంద‌గా… ఇప్పుడు కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే ఇందిర కూడా మృతిచెందారు. ఇక కొన్నేళ్ల క్రిత‌మే కృష్ణ మ‌రో భార్య విజ‌య‌నిర్మ‌ల కూడా మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇందిర‌ను పెళ్లి చేసుకున్నాక కృష్ణ త‌న తోటి హీరోయిన్ విజ‌య‌నిర్మ‌లను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక కృష్ణ – ఇందిర దంప‌తుల పిల్ల‌ల్లో పెద్ద కుమారుడు ర‌మేష్ కొన్ని సినిమాల్లో హీరోగా చేసి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారారు. అనారోగ్యంతో ఇటీవ‌లే మృతి చెందారు. ఇక రెండో కుమారుడు మ‌హేష్‌బాబు టాలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్‌గా ఉన్నారు. కుమార్తెల్లో పెద్ద కుమార్తె ప‌ద్మావ‌తి గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ భార్య‌. వీరి కుమారుడు గ‌ల్లా అశోక్ కూడా ఇటీవ‌లే హీరో సినిమాతో హీరో అయ్యాడు.

ఇక ప్రియ‌ద‌ర్శిని భ‌ర్త సుధీర్‌బాబు కూడా టాలీవుడ్‌లో హీరోగా ఉన్నాడు. ఇక మంజుల గ‌తంలో న‌టి కాగా.. నిర్మాత కూడా.. ఆమె భ‌ర్త కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇందిర మృతికి సినిమా, రాజ‌కీయ‌, పారిశ్రామిక రంగాల‌కు చెందిన ప‌లువురు ప్రముఖులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news