Newsశోకశంద్రంలో బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌.. మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం..!!

శోకశంద్రంలో బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌.. మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం..!!

మెహబూబ్‌ దిల్‌సే..ఈ పేరు కు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. టాలెంట్ ఎక్కడున్న జనాలు ఆదరిస్తారని తెలియజేసిన పేరు ఇది. సోషల్ మీడియా ను ఓ మంచి ప్లాట్ ఫాం గా చేసుకుని..తన టాలెంట్ ను నలుగురుకి చూయిస్తూ..తనకంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్న ఈ యూట్యూబ్ సెలబ్రిటీ..మనకు బాగా సుపరిచితుడే. తనదైన స్టైల్ లో వీడియోలు చేస్తూ..జనాల మెప్పు పొందిన ఈయన..బిగ్ బాస్ ఆఫర్ రావడంతో..హౌస్ లోకి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్ లో తన ఫ్రెండ్ సోహెల్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్రెండ్ షిప్ కే కొత్త అర్ధాలు తీసుకోచ్చారు మెహబూబ్‌-సోహెల్. వీళ్ల ఫ్రెండ్ షిప్ చూసి..మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారు. ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చినప్పుడు.. వాళ్ళ ఇంటి కల నెరవేర్చడం కోసం ఆయన స్వయంగా డబ్బులు ఇచ్చారు. ఆ టైంలో వీళ్ల పేర్లు మారుమ్రోగిపోయాయి. ఆ తరువాత ఇద్దరు వాళ్ళ వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. ఆయన సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నాడు.

సొంత ఇల్లు అనేది వాళ్ళ అమ్మ నాన్న ల కల అని..చాలా ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. అయితే, మెహబూబ్‌ ఎంతగానో ప్రేమించే వాళ్ళ అమ్మగారు..ఇక లేరు. ఆమె మరణించారు. దీంతో మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్‌ తల్లి మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్‌ ఓ సుధీర్ఘ పోస్టును షేర్‌ చేశాడు. ఆ పోస్ట్ చూసిన ఎవ్వరికైన కంట నీరు రావాల్సిందే. “అమ్మా.. నన్ను నువ్వు ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్‌.. ఇకపై నేను ఎలా బ్రతకాలి..నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? నాతో ఎవ్వరు మాట్లాడుతారు? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ? నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా.”..అంటూ రాసుకొచ్చాడు. దీంతో మెహబూబ్‌ దిల్‌సే అమ్మగారికి ఆత్మ కు శాంతి కలగాలని ఫ్యాన్స్ తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news