Movies"ఎలా కావలన్నా వాడుకో"..సాయి పల్లవికి ఫుల్ రైట్స్ ఇచ్చిన టాలీవుడ్ హీరో..!!

“ఎలా కావలన్నా వాడుకో”..సాయి పల్లవికి ఫుల్ రైట్స్ ఇచ్చిన టాలీవుడ్ హీరో..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న అందాల ముద్దుగుమ్మలలో సాయి పల్లవి కూడా ఒకరు. ఫిదా సినిమాతో తెలుగు తెర కు పరిచయమైన ఈ బ్యూటీ..ఇప్పుడు ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. దానికి కారణం అమ్మది సిన్ సీయారిటీ..డెడికేషన్..కష్టం..నిజాయితి. నిన్న మొన్నతీ వరకు సినీ ఇండస్ట్రీలో అమ్మడు పేరు చెప్పితే పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోయేవారు. కానీ, రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యుల్లో కాశ్మీరి ఫైల్స్ తో గో రక్షకుల ఇన్సీడెంట్ ను ముడి పెడుతూ అమ్మడు మాట్లాడిన మాటలు కొందరి జనాలకు కోపం తెప్పించాయి.

దీంతో ఆమె పై నెగిటీవ్ కామెంట్స్ చేస్తూ..విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, అమ్మడు మళ్లీ మనముందుకు ఓ మంచి స్టోరీని చూయిస్తూ”గార్గి” సినిమాతో రాబోతుంది. తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో .. కోర్టు డ్రామా మూవీగా రాబోతున్న సినిమానే..ఈ ‘గార్గి’. ఈ సినిమా అంతా సాయి పల్లవి పైనే ఆధారపడి ఉంటుందట. నో రొమాన్స్, నో కామెడీ, అంతా తండ్రి కూతుళ్ల బంధం, న్యాయం కోసం లా చదవని..అస్సలు కొర్ట్ అంటేనే భయపడే ఓ అమ్మాయి..తన తండ్రి కోసం చేసిన పోరాటమే ఈ సినిమా అంటూ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. స్టార్ హీరో లు కూడా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు. అయితే తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో మాత్లాదుతూ..” సూర్య , జ్యోతిక గార్లు సినిమా చూశాక ఈ సినిమాకి సమర్పకులుగా ఉంటామని చెప్పారు.

కానీ, రానా..నేను మేసేజ్ చేసి..నా మాటలు కంప్లీట్ అవ్వకముందే..ఓకే,,నా పేరుని ఎలా కావాలో అలా వాడుకో..ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. అలాంటి ఫ్రెండ్ నాకు ఒకరు దొరికినందుకు..చాలా హ్యాపీ గా ఉంది..” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ డ్రామాగా సాగడంతో ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news