Moviesవారెవ్వా..బాలయ్య డైరెక్టర్ తో మహేశ్ బాబు..కానీ,ఈ కండీషన్ ఏంటి సామీ..?

వారెవ్వా..బాలయ్య డైరెక్టర్ తో మహేశ్ బాబు..కానీ,ఈ కండీషన్ ఏంటి సామీ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు..ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారన్న టాక్ హైలెట్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాని అతడు మూబికి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్ అన్న టాక్ బయటకు వచ్చింది.

సేమ్ ఆ సినిమాలో లాగే మహేశ్ ఈ సినిమాలో కూడా ఫ్యామిలి సెంటిమెంట్స్ పడిస్తారని అంటున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమాలో టాలీవుడ్ బుట్ట బోమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కధ అనుసారంగా మరో హీరోయిన్ కూడా ఉందని..ఆ పాత్ర కోసం మరో కుర్ర బ్యూటీ ని సెలక్ట్ చేసిన్నత్లు తెలుస్తుంది. ఈ సినిమాని డిసెంబరు నెలకి పూర్తి చేసేసి..ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమాను చేయ్యబోతున్నాడు మహేశ్.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా అంతా కూడా ఆఫ్రికా అడవుల నేపధ్యంలోనే వెళ్తుందట. ఇంత వరకు ఇండియన్ సినిమా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ కాన్ సెప్ట్ ఉండబోతుందట. ఖచ్చితంగా అభిమానులు లైక్ చేస్తారని అంటున్నారు రాజమౌళీ. కాగా, ఈ సినిమా కంప్లీట్ అయ్యాక..బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో మహేశ్ ఓ సినిమాకి కమిట్ అయ్యిన్నత్లు టాక్ వినిపిస్తుంది. “క్రాక్” తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మ‌లినేని మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారారు.

ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, మహేశ్-గోపిచంద్ సినిమాని కూడా మైత్రీ మూవీస్ వారే నిర్మించడానికి ట్రై చేస్తున్నారట. కానీ, డైరెక్టర్ కి ఓ కండిషన్ పెట్టారట. గోపీచంద్ బాలయ్యతో చేస్తున్న సినిమా సూపర్ హిట్ అయితేనే ఈ మహేశ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారట. ఏది ఏమైనా..మహేశ్ బాలయ్య డైరెక్టర్ తో సినిమా అంటేనే సరికొత్త బజ్ ఏర్పడింది. మరి చుడాలీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news