Moviesరష్మిక కు పెద్ద తలనొప్పి గా మారిన కళావతి.. ఇప్పుడు అస్సలు...

రష్మిక కు పెద్ద తలనొప్పి గా మారిన కళావతి.. ఇప్పుడు అస్సలు మజా స్టార్ట్..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయం రష్మిక కొంప ముంచేస్తుందా..అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం లేకపోనూలేదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలే అవుతుంది. మంచి మంచి సినిమాలు చేసి..స్టార్ హీరో కళ్లల్లో పడింది. మహానటి లాంటి గొప్ప సినిమాలో సావిత్రి గారిలా నటించి అభిమానులను మెప్పించింది. సినిమా రిలీజ్ అయ్యి..సంవత్సరాలు గడుస్తున్న..ఇప్పటికి ఆమెను మహానటిగానే గుర్తిస్తున్నారు జనాలు..అంత బాగా ఆ పాత్రలో లీనమైపోయింది కీర్తి.

కాగా, హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎన్ని సినిమాలు చేసినా..ఏ ఒక్క సినిమాలో కూడా తన హద్దులు దాటలేదు. గ్లామరస్ గా కనిపించడానికి ట్రై చేసింది కాని..వల్గర్ గా చూయించలేదు. ఇప్పటి వరకు ఆమె తన నాభి అందాలను చూయించలేదు. కానీ, ఫస్ట్ టైం ఆమె సర్కారు వారి పాట సినిమాలో ఓవర్ గ్లామరస్ షో చేసి..మిగత హీరోయిన్ల కు దడ పెంచేసింది. ఇన్నాళ్లు పద్ధతిగా కనిపించిన కీర్తి..ఒక్కసారిగా “మ మ మహేశా” సాంగ్ లో కనిపించిన తీరు అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో ఇప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు అందరు..కీర్తి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలకి రష్మిక వైపు చూసిన దర్శకులు..ఇప్పుడు కీర్తి వెంట అప్డుతున్నారు. ఇన్నాళ్లు ఓవర్ గ్లామరస్ పాత్రలు అంటూ హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన రష్మిక..కీర్తి సురేష్ దెబ్బకు దిగివస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు అమ్మడు తన దగ్గరకి వచ్చే నిర్మాతలకు మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ చెప్పుతుందట. మరోపక్క కీర్తి మాత్రం సర్కారు వారి పాట సినిమా తరువాత తన పారితోషకాని ఏకంగా కోటి పెంచేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు..బోల్డ్ గా నటించడానికి కూడా ఓకే చెప్పుతుందట. ప్రస్తుత్తం అమ్మడు చిరంజీవికి చెల్లెలుగా..భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news