Moviesషాకింగ్‌: సీనియ‌ర్ హీరోయిన్ మీనా భ‌ర్త ఆక‌స్మిక మృతి.. ఏం జ‌రిగిందంటే..

షాకింగ్‌: సీనియ‌ర్ హీరోయిన్ మీనా భ‌ర్త ఆక‌స్మిక మృతి.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్‌లో బాల‌న‌టిగా ప‌లు సినిమాల్లో న‌టించిన మీనా మ‌నంద‌రికి తెలిసిన అమ్మాయే. ఇప్పుడు ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భ‌ర్త హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. మీనా బాల‌న‌టిగా ప‌లు సినిమాలు చేశాక న‌వ‌యుగం సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత సీతారామ‌య్యగారి మ‌న‌వ‌రాలు, ఇంద్ర‌భ‌వ‌నం, జ‌గ‌న్నాట‌కం, చంటి లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో వ‌రుస‌గా న‌టించింది. అప్ప‌ట్లో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి హీరోల ప‌క్క‌న హిట్ సినిమాల్లో న‌టించింది.

ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంతో పాటు మ‌ళ‌యాళంలోనూ ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత మీనా 2009లో చెన్నైకు చెందిన విద్యాసాగ‌ర్‌ను వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో స్థిర‌ప‌డింది. ఫ్యామిలీ లైఫ్‌లో స్థిర‌ప‌డిన త‌ర్వాత కూడా ఆమె కొన్ని సినిమాల‌లో న‌టిస్తోంది. దృశ్యం సినిమాల‌తో పాటు
మోహ‌న్‌బాబు మామ మంచు అల్లుడు కంచు సినిమాల్లోనూ క‌నిపించింది.

ఇక మీనా – విద్యాసాగ‌ర్ దంప‌తుల‌కు నైనిక అనే కుమార్తె కూడా ఉంది. నైనిక విజ‌య్ హీరోగా వ‌చ్చిన తేరి ( తెలుగులో పోలీసోడు ) సినిమాలో కూడా న‌టించింది. గ‌త జ‌న‌వ‌రిలో మీనా కుటుంబం కోవిడ్ భారిన ప‌డింది. ఆ స‌మ‌యంలో కోలుకున్న ఆమె భ‌ర్త అప్ప‌టి నుంచి అప్పుడ‌ప్పుడు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త రాత్రి చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న మృతిచెందారు. దీంతో మీనా తీవ్ర శోక‌సంద్రంలోకి వెళ్లిపోయింది.

విద్యాసాగ‌ర్‌కు కొన్నాళ్ల నుంచి ఊపిరితిత్తుల వ్యాధి ఉంద‌ని అంటున్నారు. అప్పుడ‌ప్పుడు ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌డం కూడా ఇబ్బందిగా మారుతోంద‌ట‌. గ‌త రాత్రి కూడా ఇదే స‌మ‌స్య రావ‌డంతో చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ట‌. డాక్ట‌ర్లు ఎంత పోరాడినా ఆయ‌న ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు. మీనా భ‌ర్త మృతితో ప‌లువురు ఇండ‌స్ట్రీకి చెందిన వారు ఆమె ఇంటికి క్యూ క‌డుతున్నారు. ఆమె భ‌ర్త ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ట్వీట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news