Moviesషూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ..సినిమాను డస్ట్ బిన్ లో...

షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ..సినిమాను డస్ట్ బిన్ లో పడేసిన నిర్మాత..!!

అర్జున్ రెడ్డి సినిమా ను మర్చిపోగలమా..ఆ పేరు తలచుకుంటుంటేనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అంతలా జనాలమదిలోకి వెళ్లింది అర్జున్ రెడ్డి సినిమా. సందీప్ వంగా తనదైన స్టైల్ లో తెరకెక్కించి..మాస్ మసాలా కాకుండా..స్వచ్చమైన ప్రేమను ..ఆ ప్రేమను ఫీల్ అయితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ ను చాలా చక్కగా చూయించాడు. తెర పై విజయ్-షాలినీ పాండే..అద్భుతంగా నటించారు.

కాగా, ఈ సినిమా తెలుగులో మంచి విజయం అందుకున్న కారణంగా హీందిలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈ సినిమా ను తెరకెక్కించారు. అది ఓ పెద్ద స్టోరీ. ఒకప్పుడు మంచి మంచి హిట్ సినిమాలు తెరకెక్కించిన బాల..ఈ చిత్రాని తనదైన స్టైల్ లో విక్రమ్ కొడుకు ధ్రువ్ తో తెరకెక్కించాడు . అర్జున్ రెడ్డి సినిమా అంటేనే ధైర్యం , తెగింపు..కానీ బాల మాత్రం సిగ్గుతో మొహమాటం తో రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించాడు. దీంతో విక్రమ్ సినిమా బాగోలేదూ అని ఫేస్ మీదనే చెప్పేశారట. “నా కొడుకుని ఇలాంటి చెత్త సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తే.,,ఇజత్ మొత్తం పోతాది..నీకు దండం సామీ..”అంటూ ఆ సినిమా ను ధియేటర్స్ లో రిలీజ్ చేయకుండా..చెత్త బుట్టలో వేసారట.

ఇక మళ్ళీ ఫ్రెష్ గా తెలుగు లో అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న గీరిషయ్య అనే డైరెక్టర్ తో తెరకెక్కించి పర్లేదు అనిపించుకున్నాడు. ఇక ఆ తరువాత బాల తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా వర్మ ను డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా జనాల ముందుకు తెచ్చారు. జాతియ అవార్డు గ్రహీత బాల ఈ సినిమాను ఏ రేంజ్ లో డైరెక్ట్ చేసుంటాడో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగా సినిమా చూసిన జనాలను నిరాశపరిచారు బాల. విక్రమ్ డేసిషన్ కరెక్ట్..అని అంత అనుకున్నారు. నిజానికి అప్పుడెప్పుడో విశాల్ తో వాడు వీడు సినిమా తప్పితే ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ కూడా బాల కు దెబ్బ కొట్టాయి. ప్రజెంట్ తన లక్కి హీరో తో ఓ సినిమా చేస్తున్నాడు..ఆ సినిమా కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news