Movies#NBK107 ఈ ముస‌లిమ‌డుగు ప్ర‌తాప్ రెడ్డి ఎవ‌రు.. తాటతీశాడుగా..!

#NBK107 ఈ ముస‌లిమ‌డుగు ప్ర‌తాప్ రెడ్డి ఎవ‌రు.. తాటతీశాడుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. క్రాక్‌తో హిట్ కొట్టిన బాల‌య్య అభిమాని మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు #NBK107 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. పూర్తి టైటిల్ ఏంట‌న్న‌ది రివీల్ కాక‌పోయినా ర‌క‌ర‌కాల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ తెలంగాణ‌లోని సిరిసిల్ల‌లో స్టార్ట్ చేశారు. రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రామ్ – ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో యాక్ష‌న్ సీన్లు షూట్ చేస్తున్నారు.

మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా… వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాస్త నెగిటివ్ ట‌చ్ ఉన్న రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. ఇక బాల‌య్య‌ను ఢీకొట్టే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దునియాకు మేక‌ర్స్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

సెట్‌లోకి వ‌చ్చాడో లేదో అప్పుడే దునియా విజ‌య్ లుక్ రివీల్ చేశారు. దునియా విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందో లేదో అప్పుడే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. భ‌యం అంటే ఏ మాత్రం తెలియ‌ని ముస‌లి మ‌డుగు ప్ర‌తాప్‌రెడ్డి పాత్ర‌లో విజ‌య్ న‌టిస్తున్నాడు. అస‌లు లుక్ చూస్తుంటేనే చాలా ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ అన్న‌ది తేలిపోతోంది. సిగ‌రెట్ తాగుతూ ఇంటెన్స్‌గా భ‌యంక‌ర‌మైన గెట‌ప్‌లో ఉన్నాడు. ఏదేమైనా లుక్‌తోనే తాట‌తీసిప‌డేశాడు.

ఈ సినిమాలో ముస‌లి మ‌డుగు ప్ర‌తాప్‌రెడ్డిగా విజ‌య్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని.. బాల‌య్య‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లోనే ఈ రోల్ ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. గోపీచంద్ మ‌లినేని చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా విల‌న్ పాత్ర డిజైన్ చేసిన‌ట్టు ఫ‌స్ట్ లుక్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన బాల‌య్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా చంపేసింది. మైనింగ్ జ‌రుగుతున్న ప్రాంతంలో న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌తో పాటు పంచెక‌ట్టు ధ‌రించి చాలా స్టైలీష్‌గా క‌నిపించాడు.

బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య కూడా సీమ‌లోని రెడ్డిగా క‌నిపిస్తున్నాడు. ఇక బాల‌య్య‌ను ఢీ కొట్టే ప్ర‌తాప్ రెడ్డిగా విజ‌య్ క‌నిపించ‌బోతున్నాడు. సీమ‌లో నీటికోసం జ‌రిగే ఆధిప‌త్య యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌తాప్ రెడ్డి వ‌ర్సెస్ బాల‌య్య మ‌ధ్య ఎలాంటి ప‌వ‌ర్ ఫుల్ పోరు జ‌రిగింద‌న్న నేప‌థ్య‌మే ఈ సినిమా క‌థ అంటున్నారు. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించే ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్‌, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news