Gossipsప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ షాక్..దిల్ రాజు కొంప ముంచేస్తున్నాడురోయ్..?

ప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ షాక్..దిల్ రాజు కొంప ముంచేస్తున్నాడురోయ్..?

కోట్లాది మంది అభిమానులతో పాటు బడా బడా స్టార్ సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమా “రాధేశ్యామ్”. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్..గొల్డెన్ బ్యూటీ పూజా హెగ్డే జంట గా కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడం..దానికి తోడు ఇది లవ్ స్టోరీ కావడం..పై గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కడం..ఇలా అన్నీ విషయాలు ఈ సినిమా పై అభిమానులను భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది..మాయదారి కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.

ఆ తరువాత పరిస్ధితులు సర్దుకున్నా..ఏవో ఆటంకాలు..దీంతో ఫైనల్ గా మార్చి 11న మూహుర్తం కుదిరింది. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అంటేనే ప్రభాస్ అభిమానులు పులకరించిపోతున్నారు. సాహో తరువాత ఇప్పటి వరకు ప్రభాస్ ని తెర పై చూసిందే లేదు. దీంతో అభిమానులు ఈ సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండే కొద్ది రోజుకో వార్త ఈ సినిమా పై భయాని పుట్టిస్తుంది.

అసలే ఈ సినిమా రన్ టైం చాలా తక్కువగా ఉంది అని..ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నదే కొంచెం టైం అని..అభిమానులు బాధ పడుతుంటే..ఇప్పుడు ఉన్న ఆ అరా కొరా యాక్షన్ సన్ని వేశాలు కూడా తీసేశారంటూ వార్తలు లీక్ అయ్యాయి. ఈ సినిమా రన్ టైం దాదాపు 2.30 గంటలకు తక్కవగానే ఉంటుందిని రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా పీరియాడికల్ లవ్ స్టోరీ కావడంతో దీంతో యాక్షన్ సన్నివేశాలు చాలా తక్కువగా చిత్రీకరించారట. అంతేకాదు సినిమా చాలా స్లోగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెట్టే ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

సీన్ లోకి ఎంటర్ అయిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎడిటింగ్‌లో వేలు పెట్టి కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ..అసలైన యాక్షన్ సీన్ ని ట్రిమ్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత ట్రిమ్ చేస్తారని.. 10 నిమిషాలకు పైగా సినిమా కట్ చేసారబి టాక్ వినిపిస్తుంది. దీంతో అభిమానులకు ఇది నిజంగా షాక్ ఇచ్చింది. మరి చూడాలి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో..ఎలా ఆదరిస్తారో …?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news