Moviesబన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..కొంప ముంచిన కొత్త ఐడియా..?

బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..కొంప ముంచిన కొత్త ఐడియా..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మాస్ హీరోగా నటించిన చిత్రం పుష్ప-ది రైజ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. అల్లు అర్జున్ కెరీర్ లోనే కని విని ఎరుగని కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా, పుష్పన్ సినిమా ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నా అని డైరెక్టర్ సుకుమార్ ముందే చెప్పిన సంగతితెలిసిందే. అంతేకాదు సరిగ్గ పుష్ప 1 ది రైజ్ రిలీజ్ చేసిన రోజే ..అంటే డిసెంబరు 17న 2022 లో పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేస్తా అని చెప్పాడు. అయితే ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే..అది సాధ్యం కాని పని అని తెలుస్తుంది.

ఎందుకంటే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుందట. నిజానికి పుష్ప పార్ట్ 2 షూటింగ్ పనులు ఫిబ్రవరి లోనే మొదలు కావాల్సి ఉంది. కానీ,..కొన్ని అనివార్య కారణాల వల్ల..ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. పోనీ, ఇప్పతికైన షూటింగ్ పనులు మొదలు పెట్టారా అంటే లేదు. ఇన్ సైడ్ వర్గాల నుంది అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా షూటింగ్ జూన్ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ మొదలు పెట్టాని అని అనుకుంటున్నారట.

దానికి కారణం లేకపోనూ లేదు. పుష్ప: ద రైజ్‌కి వచ్చిన ఆదరణని దృష్టిలో పెట్టుకొని, పుష్ప: ద రూల్‌లో మార్పులు చేయాలని సుకుమార్ నిర్ణయించాడని…అందుకే.. బాలీవుడ్ సహా తమిళం నుంచి కొందరు ప్రముఖుల్ని రంగంలోకి దింపాలనుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ కోసమే స్టోరీలో మార్పులు చేయాల్సి వస్తోందని..అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అంటున్నారు. సుకుమార్ చెప్పిన టైంకి ఈ సినిమా తీసుకోస్తాడు అనే నమ్మకాలు ఎవ్వరికి లేవు..మరి చూడాలి సుక్కు ఏం ప్లాన్ చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news