Moviesఉదయ్ కిరణ్ సిస్టర్ ని ఆ స్టార్ హీరో అంత టార్చర్...

ఉదయ్ కిరణ్ సిస్టర్ ని ఆ స్టార్ హీరో అంత టార్చర్ పెట్టాడా..డైరెక్టర్ మాటల వింటే షాక్..?

ఉద‌య్ కిర‌ణ్‌.. తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి..వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు . ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. అప్ప‌ట్లోనే ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. వ‌రుసగా విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి టాప్ హీరోల‌కు సైతం పోటీనిచ్చాడు.

దివంగ‌త వ‌ర్థ‌మాన హీరో ఉదయ్ కిరణ్ నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ను గుర్తు పెట్టుకున్నారు అంటే ఉద‌య్‌ ఎంత మంచి నటుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయ్ కిరణ్ నటించిన ఏ సినిమాలో అయినా సరే చాలా నేచురల్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే వారు. ఈయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ వస్టర్ హిట్ గా నిలిచిన మనసంతా నువ్వే సినిమా గుర్తుంది కదా..హా మర్చిపోయే సినిమా నా అది..ఇప్పటికి టీవిలో వస్తుంటే ఇంట్లో అందరు కలి కూర్చోని ఎంజాయ్ చేసే సినిమా. మరి ఎలా మర్చిపోగలం.

ఆ సినిమా లో ఉదయ్ నటన అందరిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించిన అమ్మాయి గుర్తుంది కదా. అదే స్వాతి బుక్స్ చదువుతూ..అన్న అంటే ప్రాణమిచ్చే క్యారెక్టర్ లో లీనమైపోయింది. ఆమె పేరే శిరీష. 2000 సమయంలో దాదాపుగా వచ్చిన ప్రతి సినిమాలో శిరీష కచ్చితంగా ఉండేది. మహేష్ బాబు, భూమిక నటించిన ఒక్కడు సినిమాలో ప్రిన్స్ ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయి క్యారెక్టర్ చేసింది. తన చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ఉదయ్ కిరణ్ కి మాత్రమే కాదు హీరో చెల్లెలు గా నటించిన శిరీష కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అంతలా చెల్లెలి పాత్రలో ఒదిగిపోయింది శిరీష. మనసంతా నువ్వే సినిమా తర్వాత వర్షం, నేనొక్కడినే, పల్లకిలో పెళ్లికూతురు సినిమా లో కొన్ని పాత్రల్లో నటించి అలరించింది.

అయితే అప్పట్లో ఓ రేంజ్ లో దూసుకుపోయిన ఈ నతి..సడెన్ గా ఇండట్రీకి దూరమైంది. కాగా, దానికి కారణం ఓ స్టార్ హీరో అని అప్పట్లో టాక్ వినిపించింది. ఈమె చెల్లెలు గా చేసిన ఓ స్టార్ హీరోనే ఈమె తో అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా నీచంగా తక్కువ చేసి మాట్లాడారట. దీంతో బాధపడిన ఆమె సదరు సిన్మా డైరెక్టర్ కు చెప్పిన పట్టించుకోలేదట. ఇండస్ట్రీలో ఇలాంటివి భరిస్తేనే నువ్వు ముందుకెళ్లగలవు అని చెప్పుకొచ్చారట. దీంతో అప్పటని నుండి సినిమాల జోళికే పోలేదట ఈ శిరీష అని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్ ఇటీవలె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శిరీష.. మౌనరాగం సీరియల్ లో నీలవేణి పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. వెండి తెర మీదనే కాదు అటు బుల్లితెరపై కూడా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శిరీష.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news