Moviesజగన్ పెట్టిన చిచ్చు: టాలీవుడ్ హీరోలను ఏకిపారేస్తున్నారుగా..?

జగన్ పెట్టిన చిచ్చు: టాలీవుడ్ హీరోలను ఏకిపారేస్తున్నారుగా..?

ప్రస్తుతం ఏపిలోని పరిస్ధితి చూస్తుంటే టాలీవుడ్ VS జగన్ ప్రభుత్వం మధ్య టఫ్ టికెట్ల ఫైట్ నడుస్తుంది. మొదటి నుండి జగన్ తీసుకునే నిర్ణయాలను తప్పు పడుతూ వస్తున్న టాలీవుడ్ పై జగన్ బిగ్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు కరోనా దెబ్బతో మూతపడి నష్టపోయిన ధియేటర్స్ ..ఏదో ఆ పాన్ ఇండియా సినిమాల వల్ల నాలుగు రుపాయిలు వేనక వేసుకుందాం అని అనుకునే టైంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నా కూడా ధైర్యం చేసి కొందరు బడా డైరెక్టర్స్ వాళ్ల సినిమాలను రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు.

అయితే సరిగ్గా ఇదే టైంలో జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో జారీ చేసింది. అంతే ఇక ఒక్కసారిగా టాలీవుడ్.. జగన్ ప్రభుత్వం పై రీవర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. బడా బడా హీరోలల్లో పవన్ ఇద్దరు ముగ్గురు హీరోల మినహా అందరు సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాని, నిఖిల్, సిద్ధార్ధ్ లాంటి వాళ్ళు జగన్ తీసుకున్న నిర్ణయాని తప్పు అంటూ వేళ్లు ఎత్తి చూపారు. దీంతో వైసీపీ నాయకులు వరుసగా ఒకరి తరువాత ఒకరు హీరో నాని పై సెటైర్లు వేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి నాని పరువు తీసేసారు.

అయినా కానీ నాని ఏ మాత్రం తగ్గలేదు శ్యాం సింగరాయ్ సక్సెస్ మీట్ లోను ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ మండిపడ్డారు . ఇక ఆ తరువాత టాలీవుడ్ హీరోలు ఒకరి తరువాత ఒకరు టికెట్ల ఇష్యూ పై మాట్లాడటం స్టార్ట్ చేసారు. దీంతో నెటిజన్స్ నెట్టింట టాలీవుడ్ స్టార్ హీరోల పై మండిపడుతున్నారు. టాలీవుడ్ హీరోలకు జగన్ ను ఎదిరించి అడిగే దమ్ము లేదా..? అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news