Moviesనాగార్జునకు కోపం వ‌స్తే ముందు ఆ ప‌నే చేస్తాడ‌ట‌..టాప్‌ సీక్రెట్ రివిల్...

నాగార్జునకు కోపం వ‌స్తే ముందు ఆ ప‌నే చేస్తాడ‌ట‌..టాప్‌ సీక్రెట్ రివిల్ చేసిన చైతు!

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కలిసి న‌టించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ‌, చైతు స‌ర‌స‌న కృతి శెట్టిలు న‌టించారు. 2016లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన `సొగ్గాడే చిన్ని నాయ‌నా` సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న బంగార్రాజు చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్షన్స్‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది. ఇక‌పోతే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నాగ చైత‌న్య‌.. సినిమా గురించి అనేక విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. అలాగే తండ్రి నాగార్జున‌కు సంబంధించి ఓ టాప్ సీక్రెట్‌ను కూడా రివిల్ చేసేశాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ `నాగార్జునకు కోపం రావాలంటే ఏం చేయాలి?` అని ప్రశ్నించ‌గా.. అందుకు చైతు స్పందిస్తూ నాన్నకు అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని సవ్యంగా జరగాలి. చివరి నిమిషంలో ప్లాన్ మార్చితే మాత్రం పీక్స్‌లో కోపం వ‌చ్చేస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. దాంతో స‌ద‌రు యాంక‌ర్ `మ‌రి ఆ కోపాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఏం చేయాలి?` అని అడ‌గ‌గా చైతు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు.

`నాన్న మంచి ఫుడ్ ల‌వర్‌. అందులోనూ హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ బిర్యానీని చ‌క్క‌గా చేస్తారు. ఆవిడ పేరు నాకు తెలియ‌దు. కానీ, నాన్న ఎప్పుడు బిర్యానీ తినాల‌ని అనుకున్నా.. ఆవిడ ద‌గ్గ‌ర నుంచి తెప్పించుకుని తింటారు. కోపం వ‌చ్చిన‌ప్పుడు ఆవిడ బిర్యాని తింటే వెంట‌నే కూల్ అయిపోతారు` అంటూ చైతు చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున‌కు బిర్యానీ వండి పెట్టే మ‌హిళ ఎవ‌రా అని ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు అక్కినేని అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news