Moviesబాల‌య్య నెక్ట్స్ సినిమాలో సింహం డైలాగ్.. ఫ్యీజులు ఎరిగిపోయేయ్‌..!

బాల‌య్య నెక్ట్స్ సినిమాలో సింహం డైలాగ్.. ఫ్యీజులు ఎరిగిపోయేయ్‌..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో భారీ విజయాన్ని ద‌క్కించుకున్నాడు. బాల‌య్య కెరీర్‌లోఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల దాటిన సినిమాగా నిలిచిన అఖండ ఏకంగా రు. 125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు ట‌చ్ చేసింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో గ‌తంలో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాల బాట‌లోనే అఖండ హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా హిట్ అయ్యాక బాల‌య్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. బాల‌య్య నెక్ట్స్ సినిమా మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడు. గ‌తేడాది ర‌వితేజ‌తో క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాను తెర‌కెక్కించిన మ‌లినేని గోపీచంద్ బాల‌య్య కోసం అదిరిపోయే ప‌వ‌ర్ ఫుల్ క‌థ రెడీ చేశాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మ‌లినేని గోపీచంద్ కూడా బోయ‌పాటి స్టైల్లోనే మాస్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ ఉంటాడు. ఈ సినిమా య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో ఓ డైలాగ్‌ను మ‌లినేని అప్పుడే రివీల్ చేసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేశాడు. రేయ్ రోడ్డు మీద జింక వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు…. అదే సింహం రోడ్డు మీదకు వచ్చిందంటే ఇంజన్ ఆపి సైలెంగ్ గా కూర్చోవాల్సిందే.. అక్కడున్నది సింహం రారేయ్ అంటూ బాలయ్యతో అదిరిపోయే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ చెప్పిస్తున్నాన‌ని మ‌లినేని చెప్పాడు.

తాజాగా బాల‌య్య టాక్ షో అన్‌స్టాప‌బుల్‌కు గెస్ట్ గా వ‌చ్చి మ‌లినేని గోపీచంద్ ఈ విష‌యాన్ని చెప్పాడు.
బాల‌య్య‌తో ఎంతో మంది ద‌ర్శ‌కులు.. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయ‌న నోట సింహం డైలాగ్ చెప్పించాల్సిందే. ఒక్క డైలాగ్‌తోనే సినిమాపై అంచ‌నాలు మామూలుగా ఉండ‌వ‌ని గోపీచంద్ క్లారిటీ ఇచ్చేశాడు. క్రాక్‌తో ఫామ్లో ఉన్న గోపీ, అఖండ‌తో ఫామ్‌లో ఉన్న బాల‌య్య క‌లిసి ఇంకెంత ర‌చ్చ చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news