Moviesఎన్టీఆర్ - ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మ‌హేష్ ఈ ముగ్గురు హీరోల‌ సెంటిమెంట్...

ఎన్టీఆర్ – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మ‌హేష్ ఈ ముగ్గురు హీరోల‌ సెంటిమెంట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ముగ్గురు హీరోలలో ఎవరికివారే వరుస సూపర్ హిట్ లతో దూసుకు పోతున్నారు. ఎవరి మార్కెట్ వారిది.. ఎవరి క్రేజ్ వారిది… ఈ ముగ్గురు హీరోల్లో పవన్ కళ్యాణ్ కాస్త ముందుగా తన కెరీర్ స్టార్ట్ చేశారు. మహేష్ బాబు 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 2000 సంవత్సరంలో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరో అయ్యారు. అప్పటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా వీరు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోలు కూడా తమ కెరీర్లో ఏడవ ఈ సినిమాతో మాత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టారు. పవన్ కళ్యాణ్ హీరోగా తన కెరీర్లో ఏడవ సినిమాగా వచ్చిన ఖుషి సూపర్ డూపర్ హిట్ అయింది. ఎస్‌.జె.సూర్య ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఆ రోజుల్లోనే 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా కూడా 150కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ మూడు సినిమాలు కూడా వీరి కెరీర్లో ఏడవ సినిమాలుగా రిలీజ్ అయ్యాయి. ఈ మూడు ఇండస్ట్రీ హిట్. ఈ మూడు సినిమాల్లోనూ భూమిక హీరోయిన్ గా నటించింది. అప్పట్లో భూమికకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే భూమికను పట్టుబట్టి మరీ తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకున్నారు ఈ మూడు సినిమాల దర్శకులు.

అలా భూమిక ఈ ముగ్గురు హీరోల‌కు ఏడో సినిమాలో న‌టించ‌డం.. అవి ఇండ‌స్ట్రీ హిట్లు కావ‌డం ఓ సెంటిమెంట్‌గా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు భూమికతో ఒక్క సినిమా మాత్రమే చేశారు. ఎన్టీఆర్ ఆ తర్వాత సాంబ సినిమా లోనూ భూమికను మరోసారి రిపీట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news