Moviesమళ్లీ కలిసి నటించనున్న ప్రభాస్-రానా..ట్వీస్ట్ ఏంటంటే..?

మళ్లీ కలిసి నటించనున్న ప్రభాస్-రానా..ట్వీస్ట్ ఏంటంటే..?

బాహుబలి .. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొల్లగొట్టిన రికార్డులు మరే సినిమా కూడా దక్కించుకోలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలోప్రభాస్, రానా, అన్నదమ్ములుగా నటించారు. అంతేకాదు రానా ప్రతి నాయకుడి క్యారెక్టర్ లో చించేసాడు. అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది.

ఈ చిత్రం తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.ఇక ఈ సినిమా తరువాత మళ్లి ప్రభాస్-రానా బద్ద శత్రువులుగా నటించడానికి రెడీ అయ్యిన్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం.

ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో ఒక అద్బుతమైన ఫాంటసీ కథను దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్దం చేసాడని సమాచారం. ప్రభాస్ 21వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు విలన్ గా రానా ను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తుంది.కాగ ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విదుల చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కానీ కధ పరంగా ప్రభాస్ చేతిలో రానా చనిపోతాడట. ఈ సినిమాలో ప్రభాస్ కు రానాకు మధ్య ఓ భారీ ఫైట్ సీన్ వస్తుందని..అక్కడే ఆయన చనిపోతాడని..ఇక ఆపుడు నుండే అసలు కధ మొదలవుతుందని టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news