Movies'సర్కారువారి పాట' సినిమా లేట్ అవ్వడం వల్ల మహేష్ బాబుకే మంచిది.....

‘సర్కారువారి పాట’ సినిమా లేట్ అవ్వడం వల్ల మహేష్ బాబుకే మంచిది.. ఎందుకంటే..?

మహేశ్‌ బాబు ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా లో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది.

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ఆఫ్ ఇండియాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘RRR ’. ఈ ఏడాది ద‌స‌రాకు విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ నేప‌థ్యంలో వాయిదాలు ప‌డుతూ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల అవుతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.దీంతో అప్ప‌టికే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన మ‌హేశ్ ‘స‌ర్కారువారి పాట‌’..ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అయ్యింది. సినిమా విడుదల లేట్ అవుతున్నా కూడా మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఎందుకంటే.. మహేష్ బాబుకి ఏప్రిల్ సెంటిమెంట్ కాబటి. ఏప్రిల్‌లో విడుదలైన ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ అయ్యి.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తర్వాత ఏప్రిల్‌లో విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సర్కారువారి పాట’ కూడా ఆ ఏప్రిల్ లోనే రిలీజ్ కు సిద్ధం కావడం విశేషం. సో… అలాంటి కెరీర్ హిట్ ను ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా ఇస్తుందేమో చూడాలి. మొత్తానికి ఈ సినిమా లేట్ అవ్వడం మచిదే మటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news