Moviesచిరంజీవి - సురేఖ శోభ‌నం ట్రైన్లో సెట్ చేసింది ఎవ‌రు..!

చిరంజీవి – సురేఖ శోభ‌నం ట్రైన్లో సెట్ చేసింది ఎవ‌రు..!

మెగాస్టార్ ఈ పేరు వింటేనే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ అభిమానులంద‌రిలోనూ ఏదో తెలియ‌ని ఓ గ‌ర్వం అయితే తొణికిస‌లాడుతుంది. నాలుగు ద‌శాబ్దాల కెరీర్‌లో ఎంతో మంది హీరోలు వ‌చ్చినా కూడా మెగాస్టార్ స్థానాన్ని రీ ప్లేస్ చేసే హీరోయే ఇప్ప‌టి వ‌ర‌కు లేరు. ఎంతోమంది సూప‌ర్‌స్టార్‌లు వ‌చ్చినా కూడా నాటికి నేటికి తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ ఒక్క‌రు మాత్ర‌మే ఉన్నారు. చిరంజీవికి కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస హిట్లు ప‌డుతున్న‌ప్పుడే అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో టాప్ క‌మెడియ‌న్‌గా ఉన్న అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ‌తో పెళ్లి అయ్యింది.

చిరు పెళ్లి అయిన కొత్త‌లో ఇత‌ర ప్రాంతాల్లో, ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్కువుగా షూటింగ్‌లు జ‌రిగేవి. అప్ప‌ట్లో చిరుకు కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉండేవారు. అందుకే చిరు త‌న‌తో పాటు భార్య సురేఖ‌ను కూడా తీసుకువెళ్లేవారు. ప‌గ‌లంతా సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న త‌ర్వాత రాత్రి మాత్ర‌మే త‌న భార్య సురేఖ‌తో ఉండేందుకు ఛాన్స్ ఉండేద‌ట‌. అయితే ఆ టైంలో చిరంజీవి కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించారు.

ఆ సినిమా షూటింగ్ ఊటీలో జ‌రుగుతోంది. పగ‌లంతా షూటింగ్ ముగించుకుని కింద‌కు వ‌చ్చి తాము బ‌స‌చేసిన ప్రాంతానికి ట్రైన్లో వెళ్లేవార‌ట‌. అయితే ఒక‌రోజు చిరంజీవికి స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చేందుకు రాఘ‌వేంద్రుడు ట్రైన్లో ఓ కంపార్ట్‌మెంట్‌ను పూర్తిగా బుక్ చేసి మ‌ల్లెపూల‌తో ఫ‌స్ట్ నైట్ రూమ్‌ను ఎలా డెక‌రేట్ చేస్తారో ? అలా చేశార‌ట‌. ఆ రోజు షూటింగ్ ముగించుకుని ట్రైన్లోకి తాను, సురేఖ వెళ్లిన వెంట‌నే అక్క‌డ ఆ శోభ‌నం డెక‌రేష‌న్ చూసి షాక్ అయ్యార‌ట‌.

త‌మ‌తో పాటు అప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ చేసి వ‌చ్చి ఆయ‌న అంత త్వ‌ర‌గానే ఇలా ప్లాన్ చేయ‌డం గ్రేట్ అన్నారు. అలాంటి ఎన్నో మెమ‌రీస్ త‌న‌కు రాఘ‌వేంద్ర‌రావు ద్వారా వ‌చ్చాయ‌ని చిరు గుర్తు చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news