Moviesపిల్లలెప్పుడు అని అడిగిన యాంకర్..తెగించేసి అసలు విషయం చెప్పేసిన ఉపాసన.. షాకింగ్...

పిల్లలెప్పుడు అని అడిగిన యాంకర్..తెగించేసి అసలు విషయం చెప్పేసిన ఉపాసన.. షాకింగ్ ఆన్సర్..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి..ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

అయితే పెళ్లై ఏడాది దాటితేనే పిల్లలెప్పుడు అని అడుగుతున్నారు జనాభా ఈ కాలంలో. అలాంటిది పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్న వీరిద్దరికి ఇంకా పిల్లలు లేరు. ఇక ఊరుకుంటారా..ఎక్కడ కనిపిస్తే అక్కడ చరణ్ ని,ఉపాసనని,చిరంజీవిని..మెగా వారసుడు ఎప్పుడు వస్తారు అని అడిగేస్తున్నారు. వాళ్లు ఏదో ఒక్క రీజన్ చెప్పి మీడియా నుండి తప్పించుకుంటున్నారు. ఇక చరణ్ తో పాటు పెళ్లైన వేరే హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి తోటి హీరోలకు ఇద్దరేసి పిల్లలు ఉన్నా.. వీళ్లకు మాత్రం పిల్లలు లేరు. ఈ విషయమై టాలీవుడ్‌లో ఇప్పటికీ చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ‌అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన దీనిపై స్పందించారు.

అది తన పరసనల్ విషయమని ఖరాకండీగా తెలిపింది.ఈ విషయంలో ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దీని గురించే చాలామంది అడుగుతున్నారు.. ఆ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తా.. .. ఏది చెప్పినా అది సెన్సేషన్ గా మారుతుంది.. అందుకే ఈ విషయాన్ని గురించి నేను మాట్లాను” అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news