Movies"వాళ్లు సర్వనాశనం కావడం ఖాయం"..సమంత షాకింగ్ పోస్ట్..!!

“వాళ్లు సర్వనాశనం కావడం ఖాయం”..సమంత షాకింగ్ పోస్ట్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్న ఒక్కటే టాపిక్ అదే.. సమంత – నాగచైతన్య విడాకులు. యస్.. అక్కినేని నాగారజున ముద్దుల కోడుకు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్ళాడిన సమంతకు విడాకులు ఇస్తున్నారు. వినడానికి బాధగా ఉన్న ఇదే నిజం. ఈ మాట ఎవరో చెప్పడం కాదు..ఏదో మీడియాలో వైరల్ అవ్వడం కాదు స్వయానే వాళ్ళే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసారు. ఇకా దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఎన్నో ప్రశ్నలు మొదలైయాయి.

అసలు సమంత నాగా చైతన్య ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు..?? పచ్చటి కాపురంలో నిప్పులు పోసిన ఆ దుర్మార్గులు ఎవరు..?? మొన్నటి వరకు బాగానే ఉన్న ఈ జంట కు ఎవరి దిష్టి తగిలింది..?? అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు రకరకాలుగా అనుకుంటున్నారు. ఎవరు ఎం మాట్లాడుకున్న..ఏం చేసినా..అంతా జరిగిపోయింది. వాళ్ళ ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత.

నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తెలిపింది. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రూమర్స్‌ రూమర్స్‌ అంటూ కొట్టిపడేఅసిన అభిమానులకు డైవర్స్ న్యూస్ విని ఫ్యాన్స్ ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే డైవర్స్ ఎనౌన్స్‌మెంట్‌ తరువాత ఊహించని పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చారు సామ్‌. అదేమిటంటే.. :నేను బాధ.. నిస్పృహలో ఉన్నప్పుడు ఒక ఓ విషయం క్లీయర్ గా అర్ధమయ్యింది. మనం ఎన్ని చేసినా చివరికి గెలిచేది ప్రేమే . అదే చారిత్రక సత్యం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల , నియంతలు ఉంటారు..వాళ్ళు వెన్నుపోటు పొడిచేసి..అది ఏది కనబడకుండా కుట్ర చేస్తారు. అలాంటి వాళ్ళు చివరకు సర్వనాశనం అయిపోతారు.. ఇది ఖాయం. ఇదే చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం అంటూ స్టోరీని పోస్ట్ చేసారు సమంత.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news