Moviesశోకశంద్రంలో ఎన్టీఆర్..నాకు మాట‌లు రావ‌డం లేదంటూ ఎమోషనల్ పోస్ట్..!!

శోకశంద్రంలో ఎన్టీఆర్..నాకు మాట‌లు రావ‌డం లేదంటూ ఎమోషనల్ పోస్ట్..!!

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి. మాయదారి కరోనా మహమారితో కొందరు మరణిస్తే..మరొ కొందరు ఆనారోగ్య కారణంగా మరణిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో చోటు చేసుకుంటున్న వ‌రుస విషాదాలు సినీ అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఒకరి విషాదం మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు తుదిశ్వాస విడుస్తున్నారు. అయితే తాజాగా సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేష్ కోనేరు గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..ఆయ‌న మ‌ర‌ణ‌వార్త ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కి గురి చేస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీకి ప‌లువురు ప్ర‌ముఖుల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటూ అనేక స‌మ‌స్య‌ల‌పై కూడా స్పందిస్తూ ఉంటారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. మహేష్ కోనేరు అకాల మరణం టాలీవుడ్ కి నిజంగా తీరని లోటు ఆని అంటున్నారు.

క‌ళ్యాణ్ రామ్‌,స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా కూడా ప‌ని చేశారు. కాగా ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు మహేశ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక మహేశ్‌ మరణ వార్త పై ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేస్తూ. “బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్‌ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news