MoviesMaa Elections:విష్ణు కోసమే ముంబై నుంచి వచ్చి ఓటు వేసిన స్టార్...

Maa Elections:విష్ణు కోసమే ముంబై నుంచి వచ్చి ఓటు వేసిన స్టార్ హీరోయిన్..ప్రకాశ్ రాజ్ మైండ్ బ్లాక్..!!

రెండు తెలుగు రాష్ట్రాల జ‌నాలు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న మా ఎన్నికలు క్లైమాక్స్‏కు చేరుకున్నాయి. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ మ‌య్యాయి. ఫిల్మ్ న‌గ‌ర్ లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్లో మూడు గ‌దుల్లో మా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ లో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఓట్లేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, సాయి కుమార్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధ్మగా మ‌రో హీరోయిన్ మా ఎన్నికలో ఓటు వేసి సందడి చేసింది.

బొమ్మరిల్లు తో హా హా హాసిని అంటూ మనలని తన యాక్టింగ్ తో ప్ళాట్ చేసినా జెనీలియా మా ఎన్నికల్లో ఓటు వేసింది. ప్రత్యేకంగా మా ఎన్నికల్లో ఓటు వేయడానికే ముంబై నుంచి వ‌చ్చారట. ఇక ఆమె ఎన్నిక‌ల ప్రాంగ‌ణంలోకి వ‌చ్చిన వెంట‌నే మంచు విష్ణు చేసిన హడావిడి మామూలుగా లేదు. ఆమెను ఓ రేంజ్ లోరిసీవ్ చేసుకుని కేంద్రంలోకి తీసుకు వ‌చ్చారు.ఇక ఓటు వేసిన వెంట‌నే జెనీలియా మీడియా తో మాట్లాడుతూ… తెలుగు పుట్టిల్లు లాంటిది… నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు అని చెప్పారు. వీరిద్ద‌రు క‌లిసి 2007లో శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన ఢీ సినిమాలో న‌టించారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news