Moviesబాల‌కృష్ణ షోకు వెళ్ళబోతున్న సెకండ్ గెస్ట్ ఎవరో తెలిస్తే.. ఖంగుతినడం పక్కా..!!

బాల‌కృష్ణ షోకు వెళ్ళబోతున్న సెకండ్ గెస్ట్ ఎవరో తెలిస్తే.. ఖంగుతినడం పక్కా..!!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు వారి ఆహాలో ఓ టాక్ షో స్టార్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అన్‌స్టాప్‌బుల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ షోపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అటు అల్లు వారి ఓటీటీ.. ఇటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ కావ‌డంతో ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది.

ప్రముఖ సినీ తారలను బాలకృష్ణ తనదైన శైలిలో చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూ చేస్తారట. సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్ గా అనే ప్రశ్నలను అడగడానికి నందమూరి బాలయ్య సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక అన్‌స్టాపబుల్ షోలో మొదట కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు బాలయ్యతో ఎలాంటి విషయాలు మాట్లాడతారో చూడాలి.

మరోవైపు..సినీ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం..బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి.. మెగా కుటుంబం నుంచి నాగబాబు గెస్ట్ గా వస్తున్నట్లు వినిపిస్తోంది.సెకండ్ గెస్ట్ ఆయనే అని అంటున్నారు. ఇక ఆ త‌ర్వాత వరుసగా స్టార్ సెలబ్రిటీస్ నేచుర‌ల్ స్టార్ నాని త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప‌లువురు మెగా హీరోలు షోలో సంద‌డి చేయ‌నున్నార‌ట‌. నవంబ‌ర్ 4 నుండి షో ప్రారంభం కానున‌న విష‌య తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news