Moviesనేను కుక్కలని అంటే.. వాళ్ళు ఎందుకు అంత బాధ..సిద్ధార్థ్ మ‌ళ్లీ మంట...

నేను కుక్కలని అంటే.. వాళ్ళు ఎందుకు అంత బాధ..సిద్ధార్థ్ మ‌ళ్లీ మంట పెట్టాడుగా..!!

కోలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్‌కు త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో కొన్ని రోజులు ఇక్క‌డ అడ్ర‌స్ లేకుండా పోయాడు. 2017లో గృహం సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వ‌గా.. అదే యేడాది అక్టోబ‌ర్ 7న చైతు – స‌మంత పెళ్లి అయ్యింది. ఇక్కడ వీరి ప్ర‌స్తావ‌న ఎందుకంటే అంత‌కు ముందు వ‌ర‌కు సిద్ధార్థ్ – స‌మంత ప్రేమ‌లో ఉండ‌డంతో పాటు స‌హ‌జీవ‌నం కూడా చేశార‌న్న టాక్ ఉంది. త‌ర్వాత వీరికి బ్రేక‌ప్ అయ్యింది.

ఇక ఇప్పుడు మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మ‌ళ్లీ అదే అక్టోబ‌ర్ నెల‌లో.. ఈ అక్టోబ‌ర్‌లోనే మ‌హాస‌ముద్రం సినిమాతో మ‌ళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక నాగ చైతన్య సమంత జంట విడాకుల విషయం అదికారికంగా ప్రకటించినప్పటి నుండి ఓ పేరు నెట్టింట బాగా వైరల్ అవుతుంది, ఆ పేరే సిద్ధార్ధ్. అంతేకాకుండ ఇప్పుడు వీళ్ళు విడిపోతున్నారు అన్నప్పుడు సిద్ధూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్‌లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.. మరి మీరేం నేర్చుకున్నారు.. అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

దీంతో సమంతపై నెగిటీవ్ ట్రోలింగ్ కి కారణమయ్యాడు సిద్దార్థ్. అయితే ఆ ట్వీట్ కు సిద్దార్థ్ రెస్పాండ్ అయ్యారు. మహాసముద్రం డైరెక్టర్ అజయ్ భూపతితో మాట్లాడుతుండగా.. సడెన్ గా చర్చలో నాకొచ్చిన ఆలోచనని.. అజయ్ వ్యాఖ్యలకి జోడించి ట్వీట్ పెట్టానని.. దానికి ఎవరో ఎదో అనుకుంటే నాకేంటని పేర్కొన్నాడు సిద్దార్థ్. తన ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే.. తాను దాని గురించి ట్వీట్ చేశానని.. దానికి ఎవరో బాధపడితే తనకు సంబంధం ఏంటి ? అని సిద్ధార్థ్ అన్నాడు. అయితే సిద్ధార్థ్ ఈ విధంగా క్లారిటీ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక సమంత గురించే ఆ ట్వీట్ చేసిన్నట్లు చెప్పకనే చెప్పేసాడు సిద్ధూ అంటూన్నారు పలువురు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news