Gossipsఆ హీరోని ఛీకొట్టి షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సాయిపల్లవి... ఎందుకో తెలుసా..??

ఆ హీరోని ఛీకొట్టి షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సాయిపల్లవి… ఎందుకో తెలుసా..??

ఏం పిల్లారా బాబు ఒక సినిమాతోనే అందరిని ఫిదా చేసి..ఆ నవ్వుతో..సిప్లిసిటీతో పెద్ద హీరోలని సైతం మెస్మరైజ్ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ పిల్ల పేరు చెబితే కుర్రకారు కిరాక్ అయిపోతున్నారు. ఇక టాలీవుడ్ లో ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి…తెలుగు, తమిళ,మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలను చేస్తోంది. ఎంత పెద్ద హీరోనైనా సరే..ఆమెకు కధ నచ్చకపోతే రిజెక్ట్ చేసి పక్కన పడేస్తుంది సాయిపల్లవి.

 

ప్రస్తుతం ఆమె నటించిన లవ్ స్టోరి అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి గురిచి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

డబుల్ హ్యాట్రిక్ హీరో నాచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఎం.సి.ఎ. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ఫై దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించారు. ఐతే, ఈ సినిమా అనుకున్నంత సక్సేస్ కాలేదు..కానీ మంచి పాజిటివ్ టాక్ ను సొతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో సాయిపల్లవి నే కావాలని ఏరికోరి పెట్టుకున్నారట నాని. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నానికి,సాయిపల్లవికి ఈ సీన్ దగ్గర క్లాష్ అయ్యిందట. ఆ సమయానికి దిల్ రాజు కూడా దగ్గర లేరట.

దీంతో ఆ చిన్న గొడవ పెరిగి మాట మాట దాటి పెద్ద ఇష్యూగా మారిందట. దీంతో సెట్ లో ఉండేవారంతా షాక్ అయ్యారట. నిజానికి సాయిపల్లవి తెలుగులో అప్పటికి ఒక్క మూవీనే చేసింది. దీంతో నాని కోపం లో..చేసిన ఒక్క సినిమాకే అంత పోగరా..అని టంగ్ స్లిప్ అయ్యారట.దీంతో కోపంతో సాయి పల్లవి ఛీ కొట్టి..ఇక నీతో సినిమా చేయను అని షూటింగ్ నుండి వెళ్లిపోయిందట. విష్యం తెలుసుకున్న దిల్ రాజు..ఇద్దరిని కూర్చోబెట్టి..అప్పటికే 70 % పూర్తైన షూటింగ్ ను.. కూల్ చేసి వాళ్లని ఒప్పించి సినిమా పూర్తి చేయించుకున్నారట. యితే ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా దిల్ రాజు అప్పట్లో బాగా మేనేజ్ చేశారని ఎవరైనా అడిగినా సరదాగా జరిగిందని చెప్పేవారట.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news