Gossipsయంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కదిలివస్తున్న ప్రభాస్..ఆ రోజు అభిమానులకు పెద్ద...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కదిలివస్తున్న ప్రభాస్..ఆ రోజు అభిమానులకు పెద్ద పండగే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు. తెలుగులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ షో తొలి సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజ‌న్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజ‌న్లలో లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, ఛ‌రిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవ‌ల్లో నిల‌బెట్టేశాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌ను షేక్ చేస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు. ఇక తారక్ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతొ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ షో ఒక వారానికి మించి మరొక వారం టీఆర్పీలను పెంచుకుంటూ పోతోంది. ఇక ఈ షో సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ పేరు బుల్లితెరపై మరోసారి మార్మోగిపోతోంది.

ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా “RRR” కో స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ అలాగే దరశక ధీరుడు రాజమౌళి వచ్చారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం తారక్ కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్నికి వచ్చారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించి షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే తాజాగా అందుతున్న సమాచరం ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు మేనేజ్మేంట్ ప్రభాస్ తో చర్చలు జరిపారని.. ప్రభాస్ టైం కూడా ఫైనల్ చేసారని టాక్. ఇదే కనుక నిజమైతే ఇద్దరు బడా హీరోలు ఒక్కే స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు పెద్ద పండగనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news