Moviesసిల్వర్ స్క్రీన్ పై మెరుపులు ..ధియేటర్ లో అరుపులు..నటసింహం సరికొత్త గెటప్..?

సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు ..ధియేటర్ లో అరుపులు..నటసింహం సరికొత్త గెటప్..?

నందమూరి బాలకృష్ణ..నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..ట్లుగు ఇండస్ట్రీకి ఎన్నో భారీ బ్లాక్ బస్ట్ర్ హిట్ సినిమాలను మదించాడు. ముఖ్యంగా హీరో బాలకృష్ణ.. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నటించిన సినిమాలు బాక్స్ ఆఫిస్ ని కలెక్షన్స్ పరంగా షేక్ చేస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే. బోయ‌పాటి – బాల‌య్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రీసెంట్ గా అఖండఅనే సినిమాతో ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి మన ముందుకు రానుంది. అఖండ తో వీరి కాంబోలో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమా మీద అటు బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు సైతం చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఉండడమే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ సినిమా కు సంబంధించిన తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రోల్స్ చేస్తున్నారు. ఒకటి ఫ్యాక్షనిట్ గా మాస్ లుక్ లో కనిపిచ్నుండగా.. మరోకటి యంగ్ లవర్ బాయ్ గా తన లుక్స్ తో ధియేటర్స్ లో అభిమానుల దగ్గర అరుపులు పెట్టించడాని రెడి అవుతున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news