Moviesఅలా చేసి వాళ్ల నోర్లు మూయించిన బన్నీ..!!

అలా చేసి వాళ్ల నోర్లు మూయించిన బన్నీ..!!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు వినాయక చవితి రోజు రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు గాయాలయ్యాయి. దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్.. ప్రమాద స్థలిలోనే స్పృహ కోల్పోయాడు. దాంతో అతనికి మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఆ తరువాత మెరిగైన చికిత్స కోసం ఆపోలో హాస్పిటల్ కు పంపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర కుటుంబ సభ్యులంతా ఆస్పత్రి వద్దకు చేరుకుని..ఆయన బాగోగులు చూసుకున్నారు. అయితే , అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్న కారణంగా ఆయన సాయిధరమ్‌ తేజ్‌ ను చూడలేకపోయారు.

ఇక ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ తీసుకుని ..తేజ్​ను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు హీరో అల్లుఅర్జున్. బన్నీ రాకతో హాస్పిటల్​ వాతావరణం అభిమానులతో నిండిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా.. సాయిధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్ పై అల్లు అర్జున్ ఏం పట్టించుకోవడలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రాకతో వాళ్ళ నోళ్లు మూయించిన్నట్లైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news