Gossipsబ్రేకప్ అయిన అల్లు-మెగా ఫ్యామిలీ.. చరణ్ చెప్పకనే చెప్పేసాడుగా..??

బ్రేకప్ అయిన అల్లు-మెగా ఫ్యామిలీ.. చరణ్ చెప్పకనే చెప్పేసాడుగా..??

కొద్ది రోజులుగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతుందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా గతంతో అల్లు అర్జున్‌కి కూడా మెగా ఫ్యాన్స్‌ మద్దతుగా నిలిచేవారు. కానీ ఇటీవల అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్‌ రావటంతో ఈ రెండు కుంటుంబాల మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. గతంలో అల వైకుంఠపురములో ఈవెంట్‌ కు మెగా ఫ్యామిలీ రాకపోవడం..ఆ తరువత చిరంజీవి పుట్టినరోజు వేడుకకు అల్లు అర్జున్ డుమ్మ కొట్టడం..ఇక రీసెంట్ గా మెగా మేనల్లుడు సాయి ధర్మ్ తేజ్ కు యాక్సిడెంట్ అయితే అందరు హీరోలు ముందుకొచ్చి ఆయన కొలుకోవాలి అంటూ హడావిడి చేస్తుంటే అల్లు అర్జున్ మాత్ర, సైలెంట్ గా ఉండడంతో అల్లుఫ్యాలిమీతో మెగా ఫ్యామిలీకి చెడిందనే వార్త మరోసారి తెర మీదకు వచ్చింది.

ఇక రాం చరణ్ తాజాగా చేసిన పనితో ఆ విష్యం పై క్లారిటీ వచ్చెసింది. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత ఆయన సెన్సేషనల్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తన 15వ సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఆయన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘డీస్నీ+హాట్‌స్టార్‌’కి కొత్తగా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారట.

ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సైన్ చేసినట్లు సమాచారం. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. తమ సంస్థకు చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంపై ఆ సంస్థ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే అల్లు ఫ్యామిలీ వారి ఆహ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండకుండా..డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సైన్ చేయడం అందరికి లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తుంది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news