Moviesటాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఆ కమెడియన్ వారసుడు.. ఎవరో...

టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఆ కమెడియన్ వారసుడు.. ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సినీ వారసులు ఎంట్రీ ఇస్తుండటం కామన్. స్టార్ హీరోగా వెలుగొందిన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి రంగంలోకి దిగుతుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ నట వారసులను రంగంలోకి దింపారు. మెగా , మంచు,అక్కినేని,అల్లు వారసులు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా జర్నీని సాగిస్తున్నారు. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఓ కమెడియన్ వారసుడు సినీ ఇండస్ట్రిలోకి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేరువైన… దూరమైన’. ఈ చిత్రంతో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. తరుణి సింగ్ హీరోయిన్. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా హీరో సుజిత్ మాట్లాడుతూ.. “ఆయన రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ తీసుకున్నాను అని.. చెపుతూ..యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ అదిరిపోద్ది అని..ఇంత వరకు ఏ సినిమాలో చూడని విధంగా ఈ సినిమాలొణి క్లైమాక్స్ షూట్ చేసామని చెప్పుకొచ్చారు. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని ఆయనని చాలా మంది ప్రశ్నించారని.. కానీ దర్శకుడు పట్టుబట్టి మరీ చేయించారని.. ఖచ్చితంగా ఈ సినిమా ఆయనకు ప్లస్ అవుతుందని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news