Gossipsఆ మెగా హీరో కారణంగానే మోసపోయిన లావణ్య ..ఏం చేసాడో తెలుసా..??

ఆ మెగా హీరో కారణంగానే మోసపోయిన లావణ్య ..ఏం చేసాడో తెలుసా..??

లావణ్య త్రిపాఠి.. ఈ అందాల రాక్షసి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఆమె గ్లామర్ అలాంటిది మరి. తన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడ్డేసిన ఈ చిన్నది..చేసింది తక్కువ సినిమాలె అయినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొతం చేసుకుంది. మంచి సెలెక్టెడ్ స్టోరీస్ ఎంపిక చేసుకుని..కెరీర్ ని ముందుకు కొనసాగిస్తుంది. లావణ్య త్రిపాఠి తెరపై ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు అమ్మడు ఆమడ దూరంలో ఉంటారు.

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మాత్రం ఈ అమ్మడుకి మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనతో అందరిని మెప్పించి..మంచి మార్కులు వేయించుకుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఓ హీరో వల్ల కష్టాలు ఎదురయ్యాయట. అది కూడా ఓ మెగా హీరో వల్లనే అని టాక్ వినిపిస్తుంది. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటించగా ఈ సినిమా కొంతవరకు పర్వాలేదు అనిపించినా.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ సినిమాలో నటించి.. ఈ సినిమా పై బాగా ఆశలు పెంచుకుంది అమ్మడు. ఈ సినిమాతో దశ తిరిగిపోతుంది అనుకుంది. కానీ టోటల్ కధ బెడిసికొట్టింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రారంభం నుండే తెగ విమర్శలు ఎదుర్కొంది. దీంతో లావణ్య త్రిపాఠి కెరీర్ మొత్తం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాతోనే నాశనం అయిందని తన అభిమానులు మండిపడుతున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news