Moviesఆ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయా ..సుశాంత్ కి అందుకే ఛాన్స్...

ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయా ..సుశాంత్ కి అందుకే ఛాన్స్ ఇచ్చా..!!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. మాట‌ల‌తో కోట‌లు క‌డుతాడు.. కాదు కాదు మాట‌ల‌తో సినిమాలు నిర్మిస్తాడు.. మాట‌ల‌తో గార‌డి చేసే ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌రోమారు త‌న‌మాట‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్థుల‌ను చేసాడు. ఈయన మాట్లాడుతున్నంతసేపు ప్రేక్షకులు అలా చూస్తుండిపోతారు. ఈయన డైలాగ్స్ అంటే ఇస్గ్టపడనివారు ఉండరు ఏమో అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ఇక రీసెంట్ గా ఈయన అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ కొత్త సినీమా..‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’..తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి… తెలుగుజాతి మాత్రమే. అయితే మొదటి నుంచి సుశాంత్ ఓ విషయంలో ఇరుక్కుపోయాడు అని మొదటి నుంచి అనిపిస్తుందని ఆయన అన్నారు.‘ఇలా ఉండాలి.. ఇలా లాంచ్ కావాలి.. ఇలాంటి సినిమాలే చేయాలని అని చాలా కాలం అనుకున్నారు. కానీ, ‘చి.ల.సౌ’ సినిమాతో ఆయన తనని తాను మళ్లీ ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో…’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అవుతుంది’’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ అన్నారు.

అక్కినేని ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ తోనే త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు. రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని ఆఈ స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక.. వెన్నెల కిషోర్ , ప్రియదర్శి, అభనవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news