Moviesఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని ఎన్నో సార్లు బోరున ఏడ్చాను..అప్పుడు నాకు...

ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని ఎన్నో సార్లు బోరున ఏడ్చాను..అప్పుడు నాకు అండగా నిలబడింది ఆయనే..!

మ‌న తెలుగు బుల్లితెర యాంక‌ర్లు బుల్లితెర పాపులార్టీ కంటే వెండితెర మీద రొమాన్స్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. వెండితెర పాపులార్టీ కోసం వీరు ఎంత‌గా పాకులాడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అన‌సూయ‌, శ్రీముఖి, రేష్మి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రేజీ యాంక‌ర్లు వెండితెర పాపులార్టీ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక వీరిలో శ్రీముఖి తెలుగు బుల్లితెర‌పై ఎలాంటి క్రేజ్ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మ‌డు.. వెండితెర‌పై న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర‌పై హాట్ హాట్‌గా త‌న అంద‌చందాలు ఆర‌బోసే శ్రీముఖి బిగ్‌బాస్‌లోకి వెళ్లి అక్క‌డ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చి టైటిల్ రేసులో చివ‌రి వ‌ర‌కు నిలిచింది.

ఇక ఈటీవీలో ప‌టాస్ షోతో శ్రీముఖి మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యింది. ఆ షోలో యాంక‌ర్ ర‌వితో ఆమె బుల్లితెర‌పై చేసిన రొమాన్స్‌కే తెలుగు ప్రేక్ష‌కులు ఓ రేంజ్‌లో ఫిదా అయిపోయేవారు. అందుకే ప‌టాస్ టీఆర్పీ రేటింగులు పేలిపోయాయి. ఇక శ్రీముఖి వెండితెర‌పై కూడా ఇప్ప‌టికే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కొన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్‌లో కూడా ఆమె న‌టించినా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. లేటెస్ట్‌గా ఆమె మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించిన “క్రేజీ అంకుల్స్” సినిమా 19న థియేటర్లలో విడుదల కానున్న క్రమంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని..షూటింగ్ చేసే సమయంలో చాలాసేపు నిలబడి కాళ్లు తిమ్మిరి పట్టేవని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అంటూ ఎన్నో సార్లు బోరున ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ..అపుడు తన తండ్రి ఇచ్చిన ధైర్యం..చెప్పిన మాట్లలతోనే తాను ఇప్పుడు ఇలా ఈ పోజిషన్ లో ఉన్నాను అని చెప్పుకొచ్చారు శ్రీముఖి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news