Moviesషాకింగ్: కార్తీకదీపం సీరియల్ నుండి ఆమె ఔట్..రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..??

షాకింగ్: కార్తీకదీపం సీరియల్ నుండి ఆమె ఔట్..రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..??

బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు. కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు.

ఈ సీరియల్ మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది. ఇందులో అత్త పాత్రలో నటిస్తున్న అర్చన కి కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.

ఈమె నటనకు అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు. అంతేకాదు మా టీవీలో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ అనే మరో సీరియల్లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ అందాల అత్తగారు. అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా అప్పుడప్పుడు తళ్లుకని మెరుస్తున్నారు. వెండితెర పై కూడా తన సత్తా చాటేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ధ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాలో తల్లి పాత్రలో నటించింది.

ఇక ఈ సీరియల్ లో అర్చన కొద్ది రోజుల నుంచి కనిపించలేదు. దీంతో ఎంతో నిరుత్సాహం చెందారు. అంతా తొందరగా సౌందర్య పాత్రను తీసివేయడం వెనుక కారణమేమని ప్రశ్నిస్తున్నారు. ఈ సీరియల్ వాళ్లే ఆమెను కావాలని తీసేసారా.. ఇదే గనుక నిజమైతే.. కారణాలు ఏమై ఉంటాయని అనుకుంటున్నారు. ఇక మరొక వార్త ఏమిటంటే అర్చనకు సినిమాలలో పలు అవకాశాలు రావడం వల్ల ఈ సీరియల్ లో నుంచి తప్పుకున్నదనే వార్త వినిపిస్తోంది. ఇక ఈమె పాత్రలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా జ్యోతి రెడ్డి కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈమె సౌందర్య లాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news