Newsఘోరం: ప‌దేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్ల‌యిన 10 నిమిషాల‌కే..

ఘోరం: ప‌దేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్ల‌యిన 10 నిమిషాల‌కే..

ఈ సంఘ‌ట‌న చాలా విషాదం అనే చెప్పాలి. వారిద్ద‌రు పదేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. చివ‌ర‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ల‌యిన 10 నిమిషాల‌కే స‌ద‌రు భ‌ర్త క‌రెంట్ షాక్‌తో చ‌నిపోవ‌డంతో అక్క‌డున్న వారంద‌రిని తీవ్రంగా క‌లిచి వేసింది. ఆ పెళ్లి కుమార్తె బాధ వ‌ర్ణనాతీతంగా మారింది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జంపీ ప్రాంతంలో జ‌రిగింది. మ‌యూరీ బాజ్ అబ్బాయి – స్వ‌ప్నా ద‌త్ ఇద్ద‌రు పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు.

మ‌యూరీ బ‌జ్ ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించ‌డంతో స్వ‌ప్నా దత్ ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి ఎట్ట‌కేల‌కు పెళ్లి సంబంధం మాట్లాడారు. ఇద్ద‌రికి ఇష్టం కావ‌డంతో క‌ట్నం లేకుండానే పెళ్లి జ‌రిగింది. పెళ్లి చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. వివాహ‌నం అనంత‌రం మ‌యూర్ బంజ్ త‌న రూమ్‌కు వెళ్లి సెల్‌ఫోన్ చార్జ్ పెట్టిన వైర్ తీశాడు అయితే ప‌క్క‌నే ఉన్న ప‌వ‌ర్ సప్లై లింక్ అత‌డి కాలికి త‌గిలింది.

 

దీంతో కొత్త పెళ్లి కొడుకు మ‌యూర్ అక్క‌డ‌క‌క్క‌డే కుప్ప కూలిపోయాడు. ఆసుప‌త్రికి తీసుకు వెళ్లే లోప‌లే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వివాహానికి వచ్చిన వారు బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. ప‌దేళ్ల ప్రేమ పెళ్లిగా మారిన ప‌ది నిమ‌షాల‌కే ఇలా విషాద‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news