Newsఎన్టీఆర్ విగ్ర‌హం ఆవిష్క‌రించిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ విగ్ర‌హం ఆవిష్క‌రించిన వైసీపీ ఎమ్మెల్యే

ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. టీడీపీ అంటే వైసీపీ నేత‌ల‌కు ఎంత మాత్రం ప‌డ‌దు. అలాంటి ఆ టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఘ‌ట్టం గుంటూరు జిల్లా తెనాలిలో జ‌రిగింది. తెనాలిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిధిలావస్థలో ఉండటం గమనించారు. తెనాలిలోని గాంధీచౌక్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హం శిథిలావ‌స్థ‌కు చేరుకున్న విష‌యం గ‌మ‌నించిన ఆయ‌న కొత్త విగ్ర‌హం ఏర్పాటు చేయించి దానిని ఆవిష్క‌రించారు.

ఈ విగ్ర‌హాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌తో పాటు స్థానిక బీసీ నేత‌లు కూడా పాల్గొన్నారు. ఇక శివ‌కుమార్ గ‌తంలో టీడీపీలోనే ఉండేవారు. ఆయ‌న తండ్రి అన్నాబ‌త్తుని స‌త్య‌నారాయ‌ణ గ‌తంలో టీడీపీ నుంచి తెనాలిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఎన్టీఆర్ అంటే స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు శివ‌కుమార్‌కు ఎంతో అభిమానం. ఇక గ‌తంలో శివ‌కుమార్ టీడీపీలోనే ఉండేవారు. త‌ర్వాత వైసీపీలోకి వెళ్లి 2014లో ఓడిపోయి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news