Moviesబుల్లితెర హీరోయిన్ శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త మ‌లుపు... ఈ సాయి...

బుల్లితెర హీరోయిన్ శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త మ‌లుపు… ఈ సాయి ఎవ‌రు..!

బుల్లితెర‌పై మ‌న‌సు మ‌మ‌త‌, మౌన‌రాగం సీరియ‌ల్స్‌లో పాపుల‌ర్ న‌టి అయిన న‌టి శ్రావ‌ణి గ‌త రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఆమె కుటుంబ స‌భ్యులు చెప్పిన దాని ప్ర‌కారం ఆమె కాకినాడ‌కు చెందిన దేవ‌రాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించింద‌ని.. అత‌డి వేధింపులు త‌ట్టుకోలేకే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలిసింది. అయితే ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. దేవ‌రాజ్ మాట్లాడుతూ శ్రావ‌ణిని తాను ఎప్పుడూ వేధించ‌లేద‌ని.. ఆమె కుటుంబ స‌భ్యుల‌తో పాటు సాయి అనే వ్య‌క్తిని అమెను దారుణంగా హింసించార‌ని… వీరంతా ఆమెను కొట్ట‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆమె ఆ అవ‌మానాలు భ‌రించ‌లేకే ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని దేవ‌రాజ్ చెప్పాడు.

 

ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు కూడా శ్రావ‌ణి త‌న‌కు ఫోన్ చేసింద‌ని.. అందువల్లే ఈ విషయం తనకు తెలిసిందని దేవ‌రాజ్ చెప్పాడు. ఆ ఇంట్లో తాను ఉండ‌లేనని.. ఐల‌వ్ యు దేవ‌.. నిన్ను మ‌న‌స్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. నువ్వు ఇప్పుడు ర‌మ్మంటే నా వ‌ద్ద ఉన్న గోల్డ్‌, క్యాష్ తీసుకుని వ‌చ్చేస్తాన‌ని చెప్పింద‌ని దేవ‌రాజ్ అంటున్నాడు. మూడు రోజులుగా షూటింగ్ ఉంది. ఇదే చివ‌రి అవ‌కాశం అని కూడా ఆమె త‌న‌తో మొర‌పెట్టుకుంద‌ని దేవ‌రాజ్ చెపుతున్నాడు.

 

ఇక సాయి అనే వ్య‌క్తి శ్రావ‌ణి జుట్టు ప‌ట్టుకుని రోడ్డుపైనే కొట్టాడ‌ని ఆమె ఏడ్చింద‌ని కూడా దేవ‌రాజ్ తెలిపాడు. తన చావుకు కారణం సాయి అనే వ్యక్తని చెప్పి చనిపోయిందని దేవరాజ్ వెల్లడించాడు. శ్రావణిని ఇంట్లో వాళ్లు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని దేవ‌రాజ్ చెప్ప‌డంతో ఈ కేసు కొత్త మ‌లుపు తిరిగే ఛాన్సులు ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news