Moviesప‌వ‌న్ బ‌ర్త్ డే.. ముగ్గురు అభిమానుల మృతితో ప‌వ‌న్ దిగ్భ్రాంతి

ప‌వ‌న్ బ‌ర్త్ డే.. ముగ్గురు అభిమానుల మృతితో ప‌వ‌న్ దిగ్భ్రాంతి

ప్ర‌ముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ‌త రాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురంలో ప‌వ‌న్ ఫ్లెక్సీలు క‌డుతుండ‌గా విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో ప‌వ‌న్ అభిమానులు ముగ్గురు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి తీవ్ర విష‌మంగా ఉందంటున్నారు. వీరిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 25 అడుగుల ఎత్తులో ఉన్న బ్యాన‌ర్ క‌డుతుండ‌గా విద్యుత్ వైర్లు త‌గిలాయి.

దీంతో ఒక్క‌సారిగా నిప్పులు రేగ‌డంతో ముగ్గురు కూడా అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఈ విషాద ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు. జ‌న సైనికుల మ‌ర‌ణం మాట‌ల‌కు అంద‌ని విషాదం అని చెప్పాడు. వారి కుటుంబాల‌కు ప్ర‌గాడ సానుభూతి తెల‌ప‌డంతో పాటు వారి కుటుంబాల‌ను ఆదుకుంటాన‌ని ప్ర‌క‌టించారు.

Pawan Kalyan fans die due to electric shock | Chitrambhalare

అంతేకాక క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకి సూచించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపోతే మరణించిన వారి లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం ఆ ప్రాంతం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news