Newsబ్రేకింగ్‌: ఒకే కుటుంబంలో 32 మందికి క‌రోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: ఒకే కుటుంబంలో 32 మందికి క‌రోనా పాజిటివ్‌

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఒకే కుటుంబంలో ఏకంగా 32 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డం దేశ‌వ్యాప్తంగానే సంచ‌ల‌నంగా మారింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి నిర్వహించిన కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా వీరికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అధికారులు షాక్ అయ్యారు. వీరితో పాటు మ‌రో 44 మందితో క‌లిపి జిల్లాలో వైర‌స్ సోకిన వారి సంఖ్య 807 చేరుకుంద‌ని స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే ఇక్క‌డే క‌రోనా కార‌ణంగా జర్నలిస్ట్ నీలన్షు శుక్లా (28) మరణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే త‌న‌కు క‌రోనా వ‌చ్చిందని.. త‌న స‌న్నిహితులు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించిన ఆయ‌న ప‌ది రోజుల్లోనే ఆరోగ్యం విష‌మించి ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 65 వేలమంది  చనిపోయారు. యూపీ  రాష్ట్రంలో మొత్తం కరోనా  కేసుల సంఖ్య 2,30,414 కు చేరగా, 3,486 మంది మరణించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news